BBC – Ram Mandir : జనవరి 22న ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నవ్య భవ్య రామమందిర ప్రతిష్ఠాపన వేడుక అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ప్రఖ్యాత మీడియా సంస్థ బ్రిటీష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (BBC) కవరేజీ ఇచ్చిన తీరుపై భారత్తో పాటు బ్రిటన్లోనూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అత్యంత పక్షపాత వైఖరితో రామమందిర కార్యక్రమం వార్తను బీబీసీ రాసిందని బ్రిటీష్ పార్లమెంట్ సభ్యుడు బాబ్ బ్లాక్మన్ పార్లమెంటు వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. UK పార్లమెంట్లో బాబ్ బ్లాక్మన్ మాట్లాడుతూ.. ‘‘అయోధ్యలోని అదే ప్రదేశంలో మసీదు కంటే ముందు.. 2వేల ఏళ్లపాటు రామమందిరం ఉండేదన్న చారిత్రక విషయాన్ని మర్చిపోయి బీబీసీ జనవరి 22న ఆ వార్తను ప్రచురించింది. ‘మసీదును ధ్వంసం చేసిన ప్రదేశంలో హిందూ ఆలయానికి ప్రతిష్ఠాపన’ అనే పదజాలాన్ని బీబీసీ వార్తలో వాడటం చాలా అభ్యంతరకరం’’ అని తెలిపారు.‘‘ప్రాణ ప్రతిష్ఠ జరిగిన ప్రదేశం..శ్రీరాముడి జన్మభూమి. అందుకే ఆ కార్యక్రమం నిర్వహణపై యావత్ హిందూలోకం సంతోషించింది’’ అని బాబ్ బ్లాక్మన్(BBC – Ram Mandir) చెప్పుకొచ్చారు. ‘‘భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పు ప్రకారం మసీదు నిర్మాణానికి అయోధ్య సమీపంలోనే ఐదెకరాల స్థలాన్ని కూడా కేటాయించిన విషయాన్ని బీబీసీ మర్చిపోయింది’’ అని ఆయన పార్లమెంటుకు తెలిపారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో BBC తప్పనిసరిగా వార్తల రూపంలో అందించాలి. అయితే ఆయా వార్తల సమాచారం తప్పుల తడకగా.. పక్షపాత వైఖరితో ఉండకూడదు’’ అని సూచించారు.
We’re now on WhatsApp. Click to Join