`భారత్ జోడో` యాత్ర పోస్టర్లు, హోర్డింగ్ లను షేర్ చేస్తూ `పరివార్ జోడో`, `బ్రష్టాచార్ జోడో` అంటూ కామెంట్లను జోడిస్తూ బీజేపీ విమర్శల వర్షం కురిపిస్తోంది. సోషల్ మీడియా వేదికగా రాహుల్ చేపట్టిన `భారత్ జోడో` యాత్రపై బీజేపీ నేతలు పలు రకాలుగా విమర్శలు చేస్తున్నారు. రాబర్ట్ వాద్రా, ప్రియాంక పోస్టర్లు ఉండడాన్ని బీజేపీ తప్పుబడుతోంది.
‘భారత్ జోడో’ అని రాబర్ట్ వాద్రా భారత జెండా ఎమోటికాన్తో కూడిన ట్వీట్లో పేర్కొన్నారు. ఆ ట్వీట్లో కాంగ్రెస్ కార్యకర్తలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి రాబర్ట్ వాద్రా అతని భార్య ప్రియాంక గాంధీ వాద్రాలతో కూడిన పోస్టర్లను అతికించిన చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ పోస్టర్లపై విరుచుకుపడిన బీజేపీ నేత షెహజాద్ పూనావాలా “కాంగ్రెస్ భారత్ జోడో వాస్తవానికి పరివార్ జోడో మరియు బ్రాష్తాచార్ జోడో మాత్రమే అంటూ ట్వీట్ చేశారు.
Bharat Jodo! 🇮🇳 🙏 pic.twitter.com/KxDqLGoFfk
— Robert Vadra (@irobertvadra) September 7, 2022
ఈ ఏడాది జూన్లో రాబర్ట్ వాద్రా తాను రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనలో ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు. నేషనల్ హెరాల్డ్ కుంభకోణం కేసుకు సంబంధించి సోనియా గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించిన తర్వాత ఆయన స్పందించారు. దేశంలో అవసరమైన మార్పును నేను తీసుకురాగలనని ప్రజలు భావిస్తే, నేను రాజకీయాల్లోకి వస్తాను” అని రాబర్ట్ వాద్రా అన్నారు. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి 3,570 కి.మీల భారత్ జోడో యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర 12 రాష్ట్రాలను కవర్ చేస్తుంది.
Congress’ Bharat Jodo is actually only PARIVAR JODO AND BRASHTACHAR JODO
If you had any doubts here you go! pic.twitter.com/Ab6S84OE61
— Shehzad Jai Hind (Modi Ka Parivar) (@Shehzad_Ind) September 7, 2022