Site icon HashtagU Telugu

LK Advani : ఆస్పత్రి నుంచి బీజేపీ దిగ్గజ నేత అద్వానీ డిశ్చార్జ్‌

Modi Advani

LK Advani : బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధానమంత్రి 96 ఏళ్ల ఎల్‌కే అద్వానీ ఢిల్లీ ఎయిమ్స్ నుంచి ఇవాళ మధ్యాహ్నం డిశ్చార్జి అయ్యారు. అన్ని వైద్య పరీక్షలను నిర్వహించిన అనంతరం ఆయనను డిశ్చార్జ్ చేస్తున్నట్లు ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. వయో సంబంధిత సమస్యలతో అద్వానీ బాధపడుతున్నారని తెలిపారు. అద్వానీ(LK Advani) ఆరోగ్యంగానే ఉన్నారని స్పష్టం చేశారు.

We’re now on WhatsApp. Click to Join

అంతకుముందు అద్వానీ అస్వస్థతకు గురి కాగా.. అత్యవసర చికిత్స నిమిత్తం ఢిల్లీ ఎయిమ్స్‌లో చేర్పించారు. ఈ ఆస్పత్రిలోని పాత ప్రైవేట్ వార్డులో ఆయనకు చికిత్స జరిగింది. ఢిల్లీ ఎయిమ్స్‌లోని యూరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ అమలేష్ సేథ్ ఆధ్వర్యంలో  వైద్యులు చికిత్స అందించారు. అద్వానీ అస్వస్థతకు గురైన విషయం తెలిసిన వెంటనే ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అద్వానీ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి, ఆయన ఆరోగ్యంపై ఆరాతీశారు. అద్వానీకి మెరుగైన వైద్యం అందించాలని ఎయిమ్స్ వైద్యులకు నిర్దేశించారు.

Also Read :Ratan Tata : వీధికుక్క కోసం అపర కుబేరుడు రతన్‌ టాటా అభ్యర్థన

Also Read :NEET-UG 2024 : ‘నీట్ మార్కుల గణన’.. ఎన్‌టీఏకు ‘సుప్రీం’ నోటీసులు