Site icon HashtagU Telugu

BJP CMs Meeting: బీజేపీ క్రాస్‌ ఎగ్జామినేషన్‌.. వైఫల్యాలపై మోడీ, షా

Bjp Cms Meeting

Bjp Cms Meeting

BJP CMs Meeting: ఇటీవల ముగిసిన పార్లమెంట్ ఎన్నికల్లో బిజిపికి ఆశించిన మెజారిటీ దక్కలేదు. 400 సీట్లతో సొంతంగా ప్రమాణస్వీకారం చేస్తామన్న బీజేపీ భంగపాటుకు గురైంది. ఫలితంగా కాంగ్రెస్ కూటమి తృటిలో అధికారం చేజార్చుకుంది. ఏదేమైనప్పటికీ కూటమి ద్వారబీజేపీ అధికారంలోకి వచ్చింది. దీంతో మోడీ ప్రధానిగా మూడవసారి ప్రమాణస్వీకారం చేశారు. అయితే ఇటీవల జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ దారుణ పరాజయం పాలైంది. ఈ నేపధ్యంలో పార్టీ తీరు, ఓటమికి గల కారణాలపై చర్చించనుంది.

లోక్‌సభ ఎన్నికల్లో భాజపా పనితీరు ఆశించిన స్థాయిలో లేదు. ఈసారి ఆ పార్టీ మెజారిటీ మార్కుకు దూరంగా నిలిచింది. ఎన్నికల్లో పేలవ ప్రదర్శన చేసినందుకు బీజేపీ ఇప్పుడు మేధోమథనం చేయబోతోంది. ఈ నెలాఖరున బీజేపీ నేతలతో భారీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi), హోంమంత్రి అమిత్ షా (Amit Shah), బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda), రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) కూడా హాజరవుతారని వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది. దీంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై సమావేశంలో చర్చించనున్నారు.

ప్రధాని మోదీ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు:

గత నెల జూన్‌ 4న జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 240, కాంగ్రెస్‌ 99 సీట్లు గెలుచుకున్నాయి. బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) లోక్‌సభలో మెజారిటీ సాధించింది, ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ ఎన్నికల్లో హిందీ మాట్లాడే మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది.

Also Read: Spirituality: సూర్యోదయంలో సూర్యుడిని పూజించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?