Patna : శానిటరీ పాడ్స్ గురించి అడిగితే…కండోమ్స్ కూడా ఫ్రీగా కావాలా అంటూ..బాలికలతో మహిళా అధికారి వ్యంగ్యం..!!

అధికారులు తమ స్థాయి...హొదాకు తగ్గట్లుగా మాట్లాడాలి. ఆఫీసర్ హోదాలో ఉన్నానని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే...ప్రజలు ఎదురుతిరిగే రోజులు కూడా ఉంటాయి.

  • Written By:
  • Publish Date - September 29, 2022 / 10:26 AM IST

అధికారులు తమ స్థాయి…హొదాకు తగ్గట్లుగా మాట్లాడాలి. ఆఫీసర్ హోదాలో ఉన్నానని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే…ప్రజలు ఎదురుతిరిగే రోజులు కూడా ఉంటాయి. ముఖ్యంగా సున్నితమైన అంశాల్లో ఆచితూచి మాట్లాడటం చాలా అవసరం. బీహార్ లో ఓ మహిళా IAS అధికారి తీరు ఇఫ్పుడు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. తక్కువ ధరలకు స్కూలు విద్యార్థినులకు శానిటరీ పాడ్స్ అందించాలని ఓ విద్యార్థిని అడిగింది. దీనికి సమాధానంగా ఆ ఐఏఎస్ అధికారిణి…కండోమ్స్ కూడా ఉచితంగా కావాలా అంటూ వ్యంగ్యంగా మాట్లాడింది. ఇప్పుడు ఈ వీడియో తీవ్ర కలకలం రేపుతోంది.

అమ్మాయిల గౌరవాన్ని పెంచండి అనే కార్యక్రమం బీహార్ లోని పాట్నాలో ఉన్న మురికి వాడలకు చెందని విద్యార్థులతో జరిగింది. ఈ కార్యక్రమానికి ఐఏఎస్ అధికారి హర్జోత్ కౌర్ భ్రమా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆమె ప్రసంగించారు. అయితే ఓ విద్యార్థిని ప్రభుత్వం రూ. 20-30 రూపాయలకు శానిటరీ ప్యాడ్స్ ఇవ్వగలదా అంటూ ప్రశ్నించింది. దీంతో ఆ అధికారి కోపంతో రగిలిపోయింది. ఇప్పుడు శానిటరీ పాడ్స్ రేపు జీన్స్… ఆ తరువాత బూట్లు, అంటూ దురుసుగా సమాధానం ఇచ్చారు.

అంతటితో ఊరుకోకుండా రేపు పెళ్లి తర్వాత కుటుంబ నియంత్రణ కోసం కండోమ్స్ కూడా ఉచితంగా ఇవ్వమని అడుగుతారంటూ మాట్లాడింది. దీంతో ఆ చిన్నారులంతా షాక్ అయ్యారు. ఈ కార్యక్రమంలో 9. 10వ తరగతి విద్యార్థినులే ఎక్కువగా ఉన్నారు. మహిళా అధికారి అయి ఉండి ఇలా మాట్లాడటం సరికాదంటూ జనాలు దుమ్మెత్తిపోస్తున్నారు.