PUBG Love Story: పబ్జీ కేసులో బిగ్ ట్విస్ట్, ఆమె పాక్ ఏజెంట్

పబ్జీ ఆడుతూ ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన యువకుడితో ప్రేమలో పడింది పాకిస్థాన్ మహిళ సీమా హైదర్

  • Written By:
  • Updated On - July 19, 2023 / 12:40 PM IST

పబ్జీ ఆడుతూ ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన యువకుడితో ప్రేమలో పడి తన నలుగురు పిల్లలతో కలిసి భారత్ లోకి అక్రమంగా ప్రవేశించింది పాకిస్థాన్ మహిళ సీమా హైదర్. ఆమెనును ఉత్తర్ ప్రదేశ్ ఏటీఎస్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ విచారణలో ఆమెకు సంబంధించిన పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. సీమా హైదర్ పాకిస్తాన్ ఏజెంట్ అని ఇర్ఫాన్ అనే వ్యక్తి నుంచి ముంబయి పోలీసులకు వచ్చిన సందేశం కలకలం రేపుతోంది.

మరోవైపు సీమా హైదర్ సరిహద్దులు దాటి భారత్ కు ఎలా వచ్చిందనే దానిపై నివేదిక ఇవ్వాలని యూపీ పోలీసులు, సాయుధ సరిహద్దు దళం SSBని నిఘా వర్గాలు ఆదేశించాయి. పాకిస్తాన్ కు చెందిన సీమా గులాం హైదర్ అనే మహిళ కు సౌదీ అరేబియాలో పనిచేసే ఓ పాకిస్తాన్ కు చెందిన వ్యక్తితో వివాహమైంది. వీరికి నలుగురు పిల్లలు జన్మించారు. అయితే సీమా గులాం నిత్యం భర్త నుంచి వేధింపులు ఎదుర్కోనేది. ఈ క్రమంలో నాలుగేళ్లుగా అతనిని కలుసుకోలేదు.

ఇదే సమయంలో పబ్ జీ ఆడే అలవాటు ఉన్న హైదర్ కు 2019లో భారత్ లోని నోయిడాకు చెందిన సచిన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ తరువాత ఇన్ స్ట్రాగ్రామ్, వాట్సాప్ ద్వారా వీరు చాటింగ్ చేసుకునేవారు. కొంతకాలం వీడియో కాలింగ్ కూడా చేసుకున్నారు. ఆ తరువాత ఇండియాకు రావడానికి హైదర్ రెడీ అయింది. అయితే ఇండియాకు ఎలా రావాలో యూట్యూబ్ ద్వారా తెలుసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతుండటంతో అసలు విషయాలు వెలుగలోకి వచ్చే అవకాశాలున్నాయి.