Site icon HashtagU Telugu

Bhupendra Patel: సీఎంగా రేపు భూపేంద్ర ప్రమాణం.. హాజరు కానున్న ప్రధాని మోదీ

Bhupendra Patel

Jpg

గుజరాత్‌లో భూపేంద్ర పటేల్ (Bhupendra Patel) కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. పార్టీ పరిశీలకులు, సీనియర్ నాయకులు రాజ్‌నాథ్ సింగ్, అర్జున్ ముండా, బిఎస్ యడ్యూరప్ప సమక్షంలో ఆయన శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యారు. గాంధీనగర్‌లోని పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన పార్టీ శాసనసభ్యుల సమావేశంలో ఆయన పేరును పార్టీ శాసనసభ్యుడు, సీనియర్ నాయకులు ప్రతిపాదించారు. ఇతర పార్టీ ఎమ్మెల్యేలు మనీషా బెన్ వకీల్, రమణ్ పాట్కర్ శంకర్ చౌదరి, పూర్ణేష్ మోదీ తీర్మానానికి మద్దతు పలికారు.

డిసెంబర్ 12న గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ (Bhupendra Patel) వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేతగా శనివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో బీజేపీ వరుసగా ఏడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. పటేల్, రాష్ట్ర అధ్యక్షుడు సిఆర్ పాటిల్, గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు దావా వేశారు. అంతకుముందు కేంద్ర పరిశీలకులు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బిఎస్ యడ్యూరప్ప, అర్జున్ ముండా సమక్షంలో శాసనసభ్యుల సమావేశంలో పటేల్‌ను నాయకుడిగా ఎన్నుకున్నారు.

Also Read: Bengaluru : బెంగళూరులో బేకరీ సిబ్బందిపై దాడి.. ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు

సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు జరగనున్న ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, సీనియర్ నేతలు హాజరుకానున్నారు. పటేల్‌తో పాటు దాదాపు 20 మంది కేబినెట్‌ మంత్రులు ప్రమాణం చేయవచ్చు. సోమవారం భూపేంద్ర రాష్ట్ర 18వ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. గాంధీ నగర్‌లోని హెలిప్యాడ్‌ మైదానంలో జరిగే కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరవుతారు. కాగా.. గురువారం వెలువడ్డ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 182 స్థానాలకు గాను ఏకంగా 156 సీట్లను కొల్లగొట్టి బీజేపీ రికార్డు విజయం సాధించిన విషయం తెలిసిందే.