Bhupendra Patel: గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్.. బీజేపీ హైకమాండ్ నిర్ణయం!

గుజరాత్ ముఖ్యమంత్రి గా భూపేంద్ర పటేల్ రెండోసారి అధికారం చేపట్టనున్నారు. ఈ మేరకు బీజేపీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది.

  • Written By:
  • Publish Date - December 10, 2022 / 03:05 PM IST

గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ (Bhupendra Patel) వరుసగా రెండోసారి కొనసాగనున్నారు. శనివారం గుజరాత్‌ (Gujarat) లో కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. కొత్త శాసనసభా పక్ష నేతను ఎంపిక చేసేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో పటేల్‌ (Bhupendra Patel) పేరును ఏకగ్రీవంగా శాసనసభా పక్ష నేతగా ప్రకటించారు. ఈ సమావేశానికి పార్టీ కేంద్ర పరిశీలకులుగా బీజేపీ సీనియర్ నేతలు రాజ్‌నాథ్ సింగ్, బీఎస్ యడ్యూరప్ప, అర్జున్ ముండా హాజరయ్యారు.

కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ మంత్రివర్గంతో కలిసి రాజీనామా చేసిన ఒక రోజు తర్వాత ఈ పరిణామం జరిగింది. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో అహ్మదాబాద్ జిల్లాలోని ఘట్లోడియా అసెంబ్లీ స్థానం నుంచి పటేల్ 1.92 లక్షల ఓట్లతో వరుసగా రెండోసారి విజయం సాధించారు. గతేడాది సెప్టెంబర్‌లో విజయ్ రూపానీ స్థానంలో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. గుజరాత్‌లో గురువారం నాడు 182 మంది సభ్యులున్న సభలో 156 స్థానాలను కైవసం చేసుకోవడం ద్వారా బిజెపి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఇది 2017లో సాధించిన 99 సీట్ల కంటే చాలా ఎక్కువ. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ ఘనవిజయం సాధించడంతో భూపేంద్ర పటేల్ (Bhupendra Patel) (60) శుక్రవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.

గత ఏడాది సెప్టెంబర్‌లో గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ స్థానంలో పటేల్ (Bhupendra Patel) బాధ్యతలు చేపట్టారు. కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవం డిసెంబర్ 12న జరుగుతుందని, అక్కడ బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా కూడా హాజరవుతారని పార్టీ ఇప్పటికే ప్రకటించింది. గుజరాత్‌లో గురువారం నాడు 182 మంది సభ్యులున్న సభలో 156 స్థానాలను కైవసం చేసుకోవడం ద్వారా బిజెపి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఇది 2017లో సాధించిన 99 సీట్ల కంటే చాలా ఎక్కువ. ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ కొనసాగుతారని, కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవం గాంధీనగర్‌లోని హెలిప్యాడ్ గ్రౌండ్‌లో సోమవారం జరుగుతుందని గుజరాత్ (Gujarat) బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్ గతంలో ప్రకటించారు.

Also Read: KTR Warning: బాసర అధికారులపై కేటీఆర్ ఫైర్!