Site icon HashtagU Telugu

Ayushman Bharat : ‘ఆయుష్మాన్​ భారత్’ ​ఆరోగ్య బీమా పరిమితి రూ.10 లక్షలకు పెంపు ?

Ayushman Card

Ayushman Card

Ayushman Bharat : ఆయుష్మాన్​ భారత్​ పథకం కింద ఇచ్చే ఆరోగ్య బీమాను కేంద్ర సర్కారు రూ. 10 లక్షలకు పెంచనుందని సమాచారం. క్యాన్సర్​, అవయవ మార్పిళ్లు లాంటి వాటి చికిత్సకు అయ్యే ఖర్చులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయుష్మాన్​ భారత్​ పథకం కింద ఇచ్చే ఆరోగ్య బీమాకు(Ayushman Bharat) రూ.5లక్షల పరిమితి ఉంది. ఇదే త్వరలో డబుల్ కానుందన్న మాట. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే మధ్యంతర బడ్జెట్​లో దీనిపై ప్రకటన వెలువడుతుందని అంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఆయుష్మాన్ భారత్​ లబ్దిదారుల సంఖ్యను కూడా 100 కోట్లకు పెంచాలని కేంద్ర ఆరోగ్య శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే మూడేళ్లలో కిసాన్​ సమ్మాన్ నిధి, భవన నిర్మాణ రంగ కార్మికులు, నాన్​ కోల్​మైన్​ వర్కర్స్, ఆశా వర్కర్స్​ను ఈ పథకంలో భాగం చేయాలని  సర్కారు యోచిస్తోంది. రూ. 10 లక్షల చొప్పున 100కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూర్చే ఈ స్కీమ్‌ అమలుకు ఏటా సుమారు రూ.12,076కోట్లు అదనంగా ఖర్చవుతాయని అంచనా వేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా వచ్చే బడ్జెట్​లో కేటాయింపులను పెంచనున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.7,200కోట్లు కేటాయించగా, ఈ ఏడాది ఆ మొత్తాన్ని రూ.15,000కోట్లకు పెంచే ఛాన్స్ ఉంది. ఆయుష్మాన్​ భారత్​ ఆరోగ్య బీమా పథకం 2018లో ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దాదాపు 6.2 కోట్ల ఆస్పత్రులు ఇందులో చేరాయి. రూ.79,157కోట్ల విలువైన చికిత్సలు జరిగాయి. జనవరి 12 నాటికి 30కోట్ల మంది ఆయుష్మాన్​ కార్డులను డౌన్​లోడ్ చేసుకున్నారు.

Also Read: 10 Strongest Currencies : టాప్-10 పవర్‌ఫుల్ కరెన్సీల లిస్టు ఇదే.. ఇండియా ర్యాంక్ తెలుసా ?

ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు 1.52 కోట్ల కార్డులు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. అత్యధిక కార్డులున్న రాష్ట్రాల్లో ఏపీ 9వ స్థానంలో నిలిచినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. ‘ఈ నెల 12 నాటికి దేశ వ్యాప్తంగా 30కోట్ల కార్డులు నమోదవగా.. 4.8కోట్ల కార్డులతో ఉత్తర్‌ప్రదేశ్‌ తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్‌, అస్సాం, రాజస్థాన్‌, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లు ఉన్నాయి. ఆసుపత్రి అడ్మిషన్లలో తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్‌, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లు వరుస స్థానాల్లో నిలిచాయి. ఏపీలో ఇప్పటివరకు 49.67 లక్షల ఆసుపత్రి అడ్మిషన్లు జరిగాయి. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా అత్యధికంగా 64.05 లక్షల మందికి డయాలసిస్‌ చికిత్సలు జరిగాయి. దీని కింద కేంద్ర ప్రభుత్వం ఏటా ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల వరకు ఆరోగ్య కవరేజి ఇస్తోంది.