ప్రధాన మంత్రి మోడీ హత్యకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కుట్ర చేసింది. ఆ మేరకు PFI సభ్యుడు షఫీక్ పాయెత్ విచారణలో అంగీకరించాడు. కేరళకు చెందిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సభ్యుడు జూలై 12న ప్రధాని నరేంద్ర మోదీ బీహార్ పర్యటనలో అవాంతరాలు సృష్టించాలని ఎలా ప్లాన్ చేసిందో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణలో వెల్లడించాడు.
ర్యాలీని ఎలా పాడు చేయాలనే దానిపై శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేశామని, బ్యానర్లు, పోస్టర్లతో నిరసనలు తెలిపేందుకు సన్నాహాలు చేశామని అరెస్టయిన పీఎఫ్ఐ సభ్యుడు షఫీక్ పాయెత్ వెల్లడించాడు దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చేందుకు దాదాపు రూ.120 కోట్లను ఈ సంస్థ నగదు రూపంలో సేకరించిందని ED కనుగొంది. రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి కూడా ఈ మొత్తాన్ని సేకరించినట్టు విచారణలో తేలింది.
దేశంలోని 15 రాష్ట్రాల్లోని 93 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించడంతో బయటపడిన చట్టవిరుద్ధ కార్యాకలాపాలు బయటపడ్డాయి. దీంతో PFI నిషేధాన్ని ఎదుర్కొంటోంది. ED, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA), రాష్ట్ర పోలీసు బలగాలు భారతదేశం అంతటా PFI తీవ్రవాద కార్యకలాపాలు, దాని ప్రమేయంపై ఆరోపిస్తూ దాడులు నిర్వహించాయి. బహుళ ఏజెన్సీల ఆపరేషన్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు చెందిన 106 మంది కార్యకర్తల అరెస్టుకు దారితీసింది.
తీవ్రవాద-సంబంధిత కార్యకర్తలతో రాడికల్ సంస్థ ప్రమేయం ఉందన్న ఆరోపణలపై NIA నమోదు చేసిన ఐదు కేసులకు సంబంధించి PFI అగ్రనేతలు , సభ్యుల ఇళ్లు , కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. తీవ్రవాదం, తీవ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం, సాయుధ శిక్షణ అందించడానికి శిక్షణా శిబిరాలను నిర్వహించడం నిషేధిత సంస్థలలో చేరడానికి ప్రజలను తీవ్రవాదం చేయడంలో PFI ప్రమేయం ఉందని తేలింది.