తమిళనాడు లోని నీలగిరి జిల్లాలో కూలిన MI -17 V5 హెలికాప్టర్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(CDS) జనరల్ బిపిన్ రావత్ కూడా ఉన్నట్లు IAF ధృవీకరించింది. హెలికాప్టర్ కూలిన సమయంలో అందులో 9 మంది ప్యాసింజర్లు ఉన్నారు. రావత్తో పాటు ఆయన భార్య మధులిక రావత్ కూడా ఉన్నారు. ఇంకా బ్రిగేడియర్ ఎల్ఎస్ లిద్దర్, లెఫ్టెనెంట్ కర్నల్ హర్జిందర్ సింగ్, ఎన్కే గురుసేవక్ సింగ్, జితేంద్ర కుమార్, వివేక్ కుమార్, సాయితేజ, హావ సత్పాల్ ఉన్నారు.
ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ముగ్గురు మరణించినట్టు గుర్తించారు. మిగిలిన వారికోసం గాలింపు జరుగుతోంది. ఆర్మీ అధికారులతో పాటు స్థానికులు కూడా గాలింపు జరుపుతున్నారు. మరోవైపు ప్రమదానికి గురైన హెలికాప్టర్ బూడిదైపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
#WATCH | Latest visuals from the spot (between Coimbatore and Sulur) where a military chopper crashed in Tamil Nadu. CDS Gen Bipin Rawat, his staff and some family members were in the chopper.
(Video Source: Locals involved in search and rescue operation) pic.twitter.com/YkBVlzsk1J
— ANI (@ANI) December 8, 2021