Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ప్రస్తుతం రెండు రోజుల గుజరాత్ పర్యటనలో ఉన్నారు. పర్యటన మొదటి రోజున ఆయన గుజరాత్ రాజధాని గాంధీనగర్కు చేరుకున్నారు. అక్కడ ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. ఆయన ఆపరేషన్ సిందూర్ గురించి పలు కీలక విషయాలు పేర్కొన్నారు. అలాగే పాకిస్తాన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా మాట్లాడుతూ.. మన సైన్యం పాకిస్తాన్లో 100 కిలోమీటర్ల లోపలికి వెళ్లి ఉగ్రవాదుల 9 స్థావరాలను ధ్వంసం చేసిందని, ఈ క్రమంలో 100 మంది ఉగ్రవాదులను హతమార్చిందని చెప్పారు. పాకిస్తాన్ కాశ్మీర్ నుంచి కచ్ వరకు పలుమార్లు దాడులకు ప్రయత్నించింది. కానీ మన సైన్యం ప్రతి దాడిని విఫలం చేసిందని, పాకిస్తాన్ ఎయిర్బేస్ను కూడా ధ్వంసం చేసిందని ఆయన తెలిపారు.
#WATCH | Gandhinagar, Gujarat | Union Home Minister Amit Shah says, "This has happened for the first time after independence that our military attacked 100 km inside Pakistan and destroyed terrorist camps. Those who used to threaten us that they have atom bombs, they thought we… pic.twitter.com/wHRrBkX49d
— ANI (@ANI) May 17, 2025
ప్రధానమంత్రి మోదీ ప్రతి దాడికి సమాధానం ఇచ్చారు
హోం మంత్రి మరింత మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ అనే పేరును ప్రధానమంత్రి మోదీనే ఇచ్చారని చెప్పారు. సైన్యం కారణంగా ఈ రోజు మన తల గర్వంగా ఉందని, అలాగే మేము అణు బెదిరింపులకు భయపడేవారు కాదని పేర్కొన్నారు. 2014 కంటే ముందు ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చి మన ప్రజలను చంపి వెళ్లిపోయేవారని, కానీ ఎలాంటి సమాధానం ఇచ్చేవాళ్లు కాదని అప్పటి కాంగ్రెస్ పాలనను ఉద్దేశించి షా అన్నారు. ప్రధానమంత్రి మోదీ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఉగ్రవాదులు మూడు పెద్ద దాడులు చేశారని, కానీ ప్రధానమంత్రి మోదీ ప్రతి దాడికి సమాధానం ఇచ్చారని, ఈ రోజు ప్రపంచం మొత్తం ఆశ్చర్యంతో చూస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read: Jyoti Malhotra: భారత్లో ఉంటూ పాకిస్తాన్కు గూఢచర్యం చేసిన మహిళా యూట్యూబర్!
1100 కోట్ల రూపాయల అభివృద్ధి పనుల ప్రారంభం
షా మాట్లాడుతూ.. ఉరీలో దాడి జరిగినప్పుడు మేము సర్జికల్ స్ట్రైక్తో సమాధానం ఇచ్చామని, పుల్వామాలో దాడి జరిగినప్పుడు ఎయిర్ స్ట్రైక్ చేశామని చెప్పారు. అయినప్పటికీ పాకిస్తాన్ సరిదిద్దుకోలేదని అది పహల్గామ్లో దాడి చేసిందని, ఈసారి మేము దాని ఉగ్రవాద ప్రధాన కేంద్రాన్నే నాశనం చేశామని ఆయన తెలిపారు. గమనించాల్సిన విషయం ఏమిటంటే.. హోం మంత్రి షా శనివారం 1100 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు. అలాగే, మూడు గృహ నిర్మాణ పథకాల డ్రా తీశారు. ఆ తర్వాత వావోల్ సమీపంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా ప్రారంభించారు.