Amazon : వచ్చేనెల నుంచి భారత్ లో ఆ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన అమెజాన్ ..!!

  • Written By:
  • Publish Date - November 27, 2022 / 10:22 AM IST

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన సర్వీసులలో ఒకటైన ఫుడ్ సర్వీసును మూసివేయనుంది. సంస్థ తీసుకున్న ఈ నిర్ణయంతో  చాలామంది కస్టమర్లు ప్రభావితం కానున్నారు. ఈ విషయాన్ని అమెజాన్ ఇండియా ప్రకటించింది. వచ్చేనెల డిసెంబర్ నుంచి భారత్ లో అమెజాన్ ఫుడ్ సర్వీసును నిలివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సర్వీసు డిసెంబర్ 29 నుంచి పూర్తిగా మూసివేయనున్నట్లు వెల్లడించింది.

కాగా అమెజాన్ ఫుడ్ సర్వీసును 2020లో ప్రారంభించింది. కోవిడ్ సమయంలో ఈ సర్వీస్ ను ప్రవేశపెట్టింది కంపెనీ. దీంతో ఎంతో మంది ప్రయోజనం పొందారు. స్విగ్గీ, జొమాటోలకు పోటీగా కంపెనీ ఈ సర్వీసును ప్రారంభించింది. మొదటిసారిగా బెంగుళూరులో ఈ సర్వీసును ప్రవేశపెట్టారు. ఇతర నగరాలకు కూడా విస్తరించేలా ప్లాన్ చేసింది కంపెనీ. అయితే కంపెనీ తన టార్గెట్ ను రీచ్ అవ్వలేకపోయింది. దీంతో శాశ్వతంగా ఫుడ్ సర్వీసును మూసివేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి అమెజాన్ ఓ ప్రకటనను విడుదలు చేసింది. అయితే కంపెనీ దశలవారీ ఈ ప్రోగ్రామ్ లను మూసివేస్తున్నట్లు తెలిపింది. ఈ సర్వీసు వల్ల ఉద్యోగాలు కోల్పోయే వారికి అమెజాన్ అండగా నిలుస్తుందని ప్రకటించింది.