Site icon HashtagU Telugu

Ahmedabad Plane Crash: విమాన శిథిలాల్లో దొరికిన కీలక క్లూ.. DVR

Dvr

Dvr

Ahmedabad Plane Crash: అహ్మదాబాద్‌ సమీపంలో జరిగిన ఘోర విమాన ప్రమాదానికి సంబంధించి గుజరాత్‌ ATS (ఆంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్) పోలీసులు కీలక ఆధారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదస్థలంలో ఉన్న శిథిలాల మధ్య నుండి డిజిటల్ వీడియో రికార్డర్ (DVR)‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ DVR‌ను డీకోడ్ చేయడం ద్వారా ప్రమాదానికి సంబంధించిన కీలక సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. “ఫోరెన్సిక్ బృందం త్వరలో విచారణ ప్రారంభించనుంది” అని గుజరాత్‌ ATS‌కి చెందిన ఒక సీనియర్‌ అధికారి తెలిపారు.

అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం, సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం సమీపంలో ఉన్న మెడికల్ హాస్టల్‌పై విరుచుకుపడింది. ఈ దారుణ ప్రమాదంలో ఇప్పటివరకు 265 మంది మరణించినట్లు సమాచారం. విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. హాస్టల్‌లో మరణించిన వారి సంఖ్య ఇంకా అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది.

DVR వ్యవస్థ విమాన భద్రతలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది విమానంలోని అనేక కెమెరాల నుండి వీడియో ఫుటేజ్‌ను రికార్డ్ చేస్తుంది. క్యాబిన్, ప్రయాణికుల కదలికలు, పైలట్‌ దృశ్యాలు మొదలైనవి ఇందులో నమోదవుతాయి. ఈ ఫుటేజ్ సంఘటనకు ముందు, తర్వాత జరిగే పరిణామాల్ని విశ్లేషించేందుకు బాగా ఉపయోగపడుతుంది.

బ్లాక్ బాక్స్‌లో కాక్‌పిట్ వాయిస్ రికార్డర్, ఫ్లైట్ డేటా రికార్డర్ వంటి పరికరాలు ఉంటే, DVR మాత్రం విజువల్ ఆధారాలను సమకూర్చుతుంది. ప్రయాణ సమయంలో నిరంతరం వీడియోను రికార్డ్ చేయగలిగే విధంగా ఇది రూపొందించబడినది. అత్యంత దృఢమైన పదార్థాలతో తయారైన ఈ పరికరం తీవ్ర ప్రమాదాల్లో కూడా దెబ్బతినకుండా ఉండేలా తయారు చేశారు.

ఈ ప్రమాదంపై దర్యాప్తు మరింత లోతుగా సాగనుంది. DVRలోని ఫుటేజ్‌ను పరిశీలించటం ద్వారా ప్రమాదానికి గల కారణాలను స్పష్టంగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. పలు కోణాల్లో ఈ డేటా ఏవిధంగా బలమైన ఆధారంగా మారుతుందో వేచి చూడాల్సిందే.

The Raja Saab : టీజర్ రిలీజ్ అవుతున్న సమయంలో ‘రాజా సాబ్’ మూవీ టీంకు బిగ్ షాక్

Exit mobile version