Site icon HashtagU Telugu

Adani-Hindenburg: అదానీ-హిండెన్‌బర్గ్ కేసులో ట్విస్ట్‌.. సుప్రీంకోర్టు నిర్ణ‌యంలో త‌ప్పులు..!

Gautam Adani

Gautam Adani

Adani-Hindenburg: అదానీ-హిండెన్‌బర్గ్ (Adani-Hindenburg) కేసులో క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ దర్యాప్తును ఆమోదిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయానికి వ్యతిరేకంగా మంగళవారం (ఫిబ్రవరి 13) రివ్యూ పిటిషన్ దాఖలైంది. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. సుప్రీంకోర్టు నిర్ణయంలో తప్పులు ఉన్నాయని, సెబీ నియంత్రణ వైఫల్యాలను కూడా విస్మరించారని పిటిషనర్ కొత్త పిటిషన్‌లో పేర్కొన్నారు.

అదానీ-హిండెన్‌బర్గ్ కేసులో సుప్రీంకోర్టు జనవరి 3న తీర్పు

అదానీ-హిండెన్‌బర్గ్ కేసులో జనవరి 3న సుప్రీంకోర్టు.. అదానీ-హిండెన్‌బర్గ్ కేసులో మిగిలిన 2 కేసులను విచారించేందుకు సెబీకి మరో 3 నెలల గడువును జనవరి 3న సుప్రీంకోర్టు ఇచ్చింది. అదే సమయంలో కేసు దర్యాప్తును సెబీ నుండి సిట్‌కు అప్పగించడానికి కూడా వారు నిరాకరించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేబీ పార్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది.

సెబీ రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌లో జోక్యం చేసుకునేందుకు ఈ కోర్టుకు ఉన్న అధికారం పరిమితం అని కోర్టు పేర్కొంది. సెబీ 24 కేసుల్లో 22 కేసుల్లో దర్యాప్తు పూర్తి చేసింది. సొలిసిటర్ జనరల్ హామీలను దృష్టిలో ఉంచుకుని మిగిలిన రెండు కేసుల దర్యాప్తును 3 నెలల్లోగా పూర్తి చేయాలని సెబీని ఆదేశిస్తున్నామని పేర్కొంది.

Also Read: Paytm Merchants: వ్యాపారుల‌కు పేటీఎం బిగ్ అప్డేట్‌.. ఫిబ్ర‌వ‌రి 29 త‌ర్వాత‌ క్యూఆర్ కోడ్‌లు ప‌ని చేస్తాయా..?

కోర్టు నిర్ణయం తర్వాత అదానీ ట్వీట్‌

కోర్టు ఈ నిర్ణయం తర్వాత అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ మాట్లాడుతూ.. ‘కోర్టు నిర్ణయం నిజం గెలిచిందని చూపిస్తుంది. సత్యమేవ జయతే. మాతో పాటు నిలిచిన వారికి నా కృతజ్ఞతలు. భారతదేశ వృద్ధి కథనానికి మా సహకారం కొనసాగుతుంది. జై హింద్.స అని ట్వీట్ చేశారు.

నవంబర్ 24న కోర్టు నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది

గత ఏడాది నవంబర్ 24న ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. అమెరికన్ కంపెనీ హిండెన్‌బర్గ్ నివేదికను వాస్తవంగా సరైనదని మేము అంగీకరించాల్సిన అవసరం లేదు. హిండెన్‌బర్గ్ ఇక్కడ లేదు. మేము దర్యాప్తు చేయమని సెబీని కోరామని కోర్టు పేర్కొంది.

We’re now on WhatsApp : Click to Join

జనవరి 24, 2023న హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్‌పై మనీలాండరింగ్ నుండి షేర్ మానిప్యులేషన్ వరకు ఆరోపణలు చేసింది. ఈ కేసును విచారించేందుకు సుప్రీంకోర్టు ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఇది కాకుండా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీని కూడా దర్యాప్తు చేయాలని కోరింది.