Acharya Pramod Krishnam: 6 ఏళ్లు కాదు 14 ఏళ్ళు బహిష్కరించండి.. ఎందుకంటే రాముడు కూడా…!

ఆచార్య ప్రమోద్ కృష్ణన్‌పై కాంగ్రెస్ వేటు వేసింది. 6 ఏళ్లుగా తనని బహిష్కరిస్తున్నట్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కాగా 6 ఏళ్ళు కాదని 14 ఏళ్ళు బహిష్కరించాలని ఆయన కాంగ్రెస్ పార్టీని అభ్యర్ధించారు

Published By: HashtagU Telugu Desk
Acharya Pramod Krishnam

Acharya Pramod Krishnam

Acharya Pramod Krishnam: ఆచార్య ప్రమోద్ కృష్ణంపై కాంగ్రెస్ వేటు వేసింది. 6 ఏళ్లుగా తనని బహిష్కరిస్తున్నట్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కాగా 6 ఏళ్ళు కాదని 14 ఏళ్ళు బహిష్కరించాలని ఆయన కాంగ్రెస్ పార్టీని అభ్యర్ధించారు . ప్రస్తుతం ఆచార్య ప్రమోద్ కృష్ణం చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

రాముడు కూడా 14 ఏళ్లపాటు వనవాసానికి వెళ్లారని.. నేను రామభక్తుడిని కాబట్టి కాంగ్రెస్‌ పార్టీ నన్ను 6 ఏళ్లు కాకుండా 14 ఏళ్ల పాటు బహిష్కరించాలని కోరుతున్నాను అంటూ ఆచార్య ప్రమోద్ కృష్ణం కామెంట్స్ చేశారు. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ సీనియర్ నేతలను టార్గెట్ చేస్తున్న ఆచార్య ప్రమోద్ కృష్ణం కొద్ది రోజుల క్రితం ప్రధాని మోడీని కలిశారు. ఆచార్య ప్రమోద్ కృష్ణం బీజేపీలో చేరే అవకాశం ఉందని ఊహాగానాలు వచ్చాయి. ఈలోగా కాంగ్రెస్‌ స్వయంగా ఆయనకు దారి చూపించింది.

కాంగ్రెస్‌ చర్యపై ఆచార్య ప్రమోద్‌ కృష్ణన్‌ స్పందిస్తూ.. నేను రామభక్తుడిని కాబట్టే రాముడు కూడా 14 ఏళ్ల పాటు బహిష్కరణకు గురయ్యాడని, కాంగ్రెస్‌ పార్టీ నన్ను 6 ఏళ్లకు బదులు 14 ఏళ్ల పాటు బహిష్కరించాలని కోరుకుంటున్నాను అని అన్నారు. తాజాగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్‌పై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ స్పందించింది. ఆచార్య ప్రమోద్ కృష్ణన్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, అందుకే ఆయనను బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్ పేర్కొంది.

నేను చేస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు ఏమిటని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు ఆచార్య ప్రమోద్‌ కృష్ణన్‌. రామ్ పేరు తీసుకోవడం పార్టీకి వ్యతిరేకమా? అయోధ్యకు వెళ్లడం పార్టీకి వ్యతిరేకమా? రామ్ లల్లా పట్టాభిషేక కార్యక్రమానికి ఆహ్వానాన్ని అంగీకరించడం పార్టీ వ్యతిరేకమా ? శ్రీ కల్కిధామ్ శంకుస్థాపన పార్టీ వ్యతిరేకమా? నరేంద్ర మోదీని కలవడం పార్టీకి వ్యతిరేకమా? శ్రీ కల్కి ధామ్ శంకుస్థాపన కార్యక్రమానికి యోగి ఆదిత్యనాథ్‌ను ఆహ్వానించడం పార్టీ వ్యతిరేకమా? ఇలా వరుస ప్రశ్నలు సంధించారు.

రామ్ లల్లా పట్టాభిషేక వేడుక ఆహ్వానాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకులు తిరస్కరించిన విషయం తెలిసిందే. అయితే పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆచార్య ప్రమోద్ కృష్ణం అయోధ్యలో కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా ఆచార్య ప్రమోద్ కృష్ణం విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్‌ తో ప్రయాణం కొనసాగించారు. ఆరేళ్లపాటు బహిష్కరణకు గురై బీజేపీతో ప్రయాణం మొదలుపెట్టనున్నారు.

Also Read: Trump – Russia Attack : నాటో దేశాలపైకి నేనే రష్యాను ఉసిగొల్పుతా: ట్రంప్‌

  Last Updated: 11 Feb 2024, 04:19 PM IST