Aam Aadmi Party : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు స్టార్ క్యాంపెయిన‌ర్ల జాబితా విడుద‌ల చేసిన ఆప్‌

గుజరాత్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల..

  • Written By:
  • Publish Date - November 9, 2022 / 08:06 AM IST

గుజరాత్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి, పార్టీ అగ్రనేత అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ డిప్యూటీ మనీష్ సిసోడియా, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో సహా పార్టీలో సీనియ‌ర్ నేత‌ల‌కు ఈ జాబితాలో చోటు ద‌క్కింది. ఆప్ ఎంపీలు సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా కూడా 20 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉన్నారు. ఈ సారి గుజ‌రాత్‌లో ఎలాగైన త‌న స‌త్తా చాటాల‌ని ఆమ్ ఆద్మీపార్టీ యోచిస్తుంది. మాజీ క్రికెటర్, పంజాబ్‌కు చెందిన రాజ్యసభ ఎంపీ హర్భజన్ సింగ్ కూడా గుజరాత్‌లో స్టార్ క్యాంపెయినర్‌గా పార్టీ తరపున ప్రచారం చేయనున్నారు. గుజ‌రాత్ ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదాన్ గాధ్వి, గుజరాత్‌లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా కూడా స్టార్ క్యాంపెయిన‌ర్ జాబితాలో ఉన్నారు.

ఈ జాబితాలో అల్పేష్ కతీరియా, యువరాజ్ జడేజా, మనోజ్ సొరాథియా, జగ్మల్ వాలా, రాజు సోలంకి, ప్రవీణ్ రామ్, గౌరీ దేశాయ్, మాథుర్ బల్దానియా, అజిత్ లోఖిల్, రాకేష్ హిరాపరా, బల్జిందర్ కౌర్, అన్మోల్ గగన్ మాన్ ఉన్నారు. ఇటు పంజాబ్ ప్రభుత్వంలోని ఇద్దరు మహిళా మంత్రులు బల్జిందర్ కౌర్, అన్మోల్ గగన్ మాన్ పేర్లు కూడా ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం 20 మంది అభ్యర్థులతో ఆరో జాబితాను విడుదల చేసింది. గుజరాత్‌లో ఇప్పటివరకు 73 మంది అభ్యర్థులను ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది.