Site icon HashtagU Telugu

BJP 6060 Crores : రూ.12వేల కోట్లలో రూ.6వేల కోట్లు బీజేపీకే.. ప్రముఖ కంపెనీల విరాళాలు ఎంత ?

Bjp 6060 Crores

Bjp 6060 Crores

BJP 6060 Crores : ఎలక్టోరల్ బాండ్ల విరాళాల వివరాలను గురువారం సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్ వేదికగా విడుదల చేసింది. 2019 ఏప్రిల్‌ 1 నుంచి 2024 ఫిబ్రవరి 15వ తేదీ దాకా జారీ చేసిన ఎన్నికల బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు సమకూరిన విరాళాల వివరాలు ఇందులో ఉన్నాయి. ఏయే కంపెనీ ఎన్ని విరాళాలు ఇచ్చింది ? ఏయే రాజకీయ పార్టీకి ఎన్ని విరాళాలు వచ్చాయి ? అనే వివరాలు ఇందులో ఉన్నాయి. అయితే ఏ పార్టీకి ఏ కంపెనీ ఎన్ని విరాళాలు ఇచ్చిందనే సమాచారాన్ని ఎస్‌బీఐ అందించకపోవడం గమనార్హం. ప్రత్యేకించి ఈ లిస్టులో రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా గ్రూప్, అదానీ గ్రూప్ వంటి దేశంలోని టాప్-3 కంపెనీల పేర్లు మచ్చుకు కూడా కనిపించకపోవడం గమనార్హం. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఎన్నికల బాండ్ల ద్వారా రూ.12,999 కోట్ల విరాళాలు అందాయి. అందులో సగం (రూ.6,060 కోట్లు) బీజేపీకే(BJP 6060 Crores) దక్కడం విశేషం.

We’re now on WhatsApp. Click to Join

విరాళాలు పొందడంలో టాప్ పార్టీలు..

విరాళాలు పొందిన పార్టీల లిస్టులో రెండో స్థానంలో రూ.1,609 కోట్లతో తృణమూల్‌ కాంగ్రెస్, రూ.1,421 కోట్లతో కాంగ్రెస్‌ పార్టీ, రూ.1,214 కోట్లతో బీఆర్‌ఎస్, రూ.775 కోట్లతో బిజూ జనతా దళ్, రూ.639 కోట్లతో డీఎంకే నిలిచాయి. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి రూ.337 కోట్లు విరాళంగా వచ్చాయి. టీడీపీకి రూ.219 కోట్లు, జనసేన పార్టీకి రూ.21 కోట్లు, ఉద్ధవ్ శివసేనకు రూ.158 కోట్లు, లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన ఆర్జేడీకి రూ.73 కోట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.65 కోట్లు విరాళంగా అందాయి.

Also Read : Megha 966 Crores : ‘మేఘా’ రూ.966 కోట్ల విరాళాలు.. తెలుగు కంపెనీల చిట్టా ఇదిగో

విరాళాలు ఇవ్వడంలో టాప్ కంపెనీలు..

Also Read :Free Coaching: గుడ్ న్యూస్.. ఆ అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్