Vande Bharat Express: ఒకేసారి 9 వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్న మోడీ

తొమ్మిది వందేభారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం జెండా ఊపి ప్రారంభించనున్నారు.

Published By: HashtagU Telugu Desk
Vandebharat

Vandebharat

11 రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాలు, వివిధ నగరాలను కలుపుకుపోయే తొమ్మిది వందేభారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం జెండా ఊపి ప్రారంభించనున్నారు. తొమ్మిది రైళ్లు రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బీహార్, పశ్చిమ బెంగాల్, కేరళ, ఒడిశా, జార్ఖండ్ మరియు గుజరాత్ రాష్ట్రాలలో వేగవంతమైన కనెక్టివిటీని అందిస్తాయి. ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు.

ఈ రేపథ్యంలో  రేపు హైదరాబాద్ నుంచి బెంగళూరు నడిచే వందే భారత్ కూడా పరుగులు పెట్టబోతోంది. సెప్టెంబరు 24న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సర్వీసును ఫ్లాగ్ ఆఫ్ చేయనున్నారు. అయితే కాచిగూడ, యశ్వంత్‌పూర్ (హైదరాబాద్ – బెంగళూరు) మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో టికెట్ ధర రూ.2,800 ఉంటుందని వాణిజ్య శాఖ వర్గాలు తెలిపాయి.

క్యాటరింగ్ సదుపాయంతో సహా వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఛార్జీలు నిర్ణయించారు. ఇది మహబూబ్‌నగర్-కర్నూల్-గూటీ మార్గంలో హైదరాబాద్-బెంగళూరు మధ్య ఎనిమిది గంటల్లో గమ్యస్థానానికి చేరుకుంటుంది. విశాఖపట్నం, తిరుపతికి రైళ్ల తర్వాత నగరంలో వందేభారత్ సర్వీస్ ఇది మూడోది.

Also Read: Singireddy Niranjan Reddy: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై విపక్షాల విషప్రచారం!

  Last Updated: 23 Sep 2023, 05:44 PM IST