భూగర్భ జలాల నిర్వహణ కోసం కేవలం 19 రాష్ట్రాలు మాత్రమే చట్టాన్ని రూపొందించాయి. వాటిలో నాలుగు రాష్ట్రాల్లో ఈ చట్టం పాక్షికంగా మాత్రమే అమలు అవుతుంది. మరో ఆరు రాష్ట్రాల్లో విధ కారణాల వల్ల ఈ చట్టం పెండింగ్ లో ఉందని కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ ( కాగ్) నివేదిక పేర్కొంది. నీటి వనరులు, నదుల అభివృద్ధి, గంగా పునరుజ్జీవన శాఖ 2005లో అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు భూగర్భ జలాల నియంత్రణ, అభివృద్ధి కోసం ఒక నమూనా బిల్లును పంపిణీ చేసి.. రాష్ట్రాలు భూగర్భ జలాల చట్టాన్ని రూపొందించడానికి వీలు కల్పించింది.
ఈ నివేదికలో 2013-18 కాలానికి సంబంధించి గ్రౌండ్ వాటర్ మేనేజ్మెంట్ అండ్ రెగ్యులేషన్ పనితీరు ఆడిట్ పరిశీలనలు ఉన్నాయి. డిసెంబర్ 2019 నాటికి 19 రాష్ట్రాలు తప్ప మిగిలిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో భూగర్భ జలాల కోసం చట్టాన్ని రూపొందించడానికి ఇప్పటి వరకు చర్య తీసుకోలేదు. డిపార్ట్మెంట్ నుండి స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడం రాష్ట్రాలు అమలు చేసే చట్టాలపై ప్రభావం చూపిందని నివేదిక పేర్కొంది. అయితే, నీతి ఆయోగ్ సూచనల మేరకు డిసెంబర్ 2019 మోడల్ బిల్లు సమీక్షలో ఉంది.
నీరు రాష్ట్రానికి సంబంధించినది కాబట్టి భూగర్భ జలాల నియంత్రణ, అభివృద్ధికి సంబంధించిన చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు రూపొందించాలి. అయితే భూగర్భ జలాల వినియోగంపై నియంత్రణ కేంద్ర, రాష్ట్ర స్థాయిలో జరుగుతుంది. అత్యున్నత స్థాయిలో భూగర్భ జల వనరుల అభివృద్ధి, వినియోగ వనరుల ఏర్పాటు కోసం మొత్తం విధాన రూపకల్పనతో జలవనరుల శాఖను కేటాయించారు.కాలు పూర్తి చేయడంలో జాప్యం, గొట్టపు బావుల (బీహార్) నిర్మాణ ప్రతిపాదనలను సిఫారసు చేసే ముందు భూగర్భ జలాల మట్టం డేటాను విశ్లేషించకపోవడం, భూగర్భ జలాల రీఛార్జ్పై ప్రాజెక్టు ఖరారులో జాప్యం వంటివి కొన్ని రాష్ట్రాల పథకాల్లో లోపాలు కనిపించాయని కాగ్ నివేదిక పేర్కొంది. యాక్షన్ ప్లాన్ (ఢిల్లీ), రాష్ట్ర భూగర్భ జల సంరక్షణ మిషన్ కార్యకలాపాల్లో లోటు, స్ప్రింక్ల్ ఇరిగేషన్ (ఉత్తరప్రదేశ్) వినియోగాన్ని అమలు చేయడంలో వెనుకబడి ఉన్నాయని తెలిపింది.