బీహార్ లో ఘోరం జరిగింది. ఓ బాణసంచా వ్యాపారి నివాసంలో భారీ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. బాణసంచా తయారు చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఈ పేలుడు జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. దాదాపు గంటసేపు పేలుళ్లు కొనసాగినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఇక పేలుడు ధాటికి ఇల్లు ధ్వంసం అయ్యింది. ఈ ఘటనలో మరో 8మంది గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన క్షతగాత్రులను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు వ్యాపారి ఇంటికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.