550 Jobs : ఇండియన్ రైల్వేస్లో ఉద్యోగం చేయాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు. అలాంటి వారికి మంచి అవకాశమిది. పంజాబ్లోని కపుర్తలాలో ఉన్న రైల్ కోచ్ ఫ్యాక్టరీలో 550 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 550 పోస్టులలో(550 Jobs).. ఫిట్టర్ 200, వెల్డర్ (G&E) – 230, ఎలక్ట్రీషియన్ – 75, పెయింటర్ (G) – 20, ఏసీ& రిఫ్రిజిరేషన్ మెకానిక్ – 15, మెషినిస్ట్ – 5, కార్పెంటర్ – 5 ఉన్నాయి. పదో తరగతి పాసై, సంబంధిత ట్రేడ్లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ పొందిన వారు అప్లై చేయొచ్చు. అభ్యర్థుల వయస్సు 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్యలో ఉండాలి. అయితే వివిధ కేటగిరీల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.100. మహిళలు, దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీలు దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
We’re now on WhatsApp. Click to Join
ఆసక్తి కలిగిన అభ్యర్థులు రైల్ కోచ్ ఫ్యాక్టరీ అధికారిక వెబ్సైట్ https://pardarsy. railnet.gov.in /apprentice/ ద్వారా అప్లై చేయాలి. ఈ వెబ్సైట్ హోం పేజ్లోని RCF Apprentice Apply Linkపై క్లిక్ చేయాలి. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 11న ప్రారంభమైంది. ఏప్రిల్ 9 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అవసరమైన వివరాలన్నీ నమోదు చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. మీకొక రిజిస్ట్రేషన్ ఐడీ, పాస్వర్డ్ క్రియేట్ అవుతాయి. వాటిని ఉపయోగించి వెబ్సైట్లోకి మళ్లీ లాగిన్ కావాలి. జాబ్ను అప్లై చేసేటప్పుడు మీకు అర్హతలన్న అప్రెంటీస్ ట్రేడ్ను ఎంచుకోవాలి. దరఖాస్తు పత్రంలో మీ వ్యక్తిగత, విద్యార్హత వివరాలు నమోదు చేయాలి. ముఖ్యమైన పత్రాలన్నీ అప్లోడ్ చేయాలి. దరఖాస్తు రుసుము కూడా ఆన్లైన్లోనే కట్టాలి.