Site icon HashtagU Telugu

Lok Sabha Election 2024: సిట్టింగ్ ఎంపీలలో 44% మంది క్రిమినల్సే: ఏడీఆర్ రిపోర్ట్

Lok Sabha Election 2024

Lok Sabha Election 2024

Lok Sabha Election 2024: 514 మంది సిట్టింగ్ ఎంపీలలో 225 మంది అంటే 44 శాతం మంది ఎంపీలు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఎన్నికల సంఘం విడుదల చేసిన ఏడీఆర్ ప్రకారం 514 మంది సిట్టింగ్ ఎంపీలలో 225 మంది ఎంపీలపై క్రిమినల్ కేసులున్నాయని తెలిపింది. అయితే వారిలో 5 శాతం మంది బిలియనీర్లు కాగా మరికొందరి ఆస్తులు రూ.100 కోట్లకు దాటాయని ఏడీఆర్ పేర్కొంది. సిట్టింగ్ ఎంపీల అఫిడవిట్లను క్షుణ్ణంగా పరిశీలించిన ఏడీఆర్ నివేదిక ప్రకారం సిట్టింగ్ ఎంపీల్లో క్రిమినల్ ఆరోపణలతో 29 శాతం మంది తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారని, ఇందులో హత్య, హత్యాయత్నం, మత సామరస్యాన్ని ప్రోత్సహించడం, కిడ్నాప్‌లు, నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

తీవ్రమైన క్రిమినల్ కేసులున్న సిట్టింగ్ ఎంపీల్లో తొమ్మిది మంది హత్య కేసులను ఎదుర్కొంటున్నారు. వీరిలో ఐదుగురు ఎంపీలు బీజేపీకి చెందినవారేనని విశ్లేషణలో తేలింది.ఇంకా 28 మంది సిట్టింగ్ ఎంపీలు హత్యాయత్నానికి సంబంధించిన కేసుల్లో ఉన్నారు. ఇందులో మెజారిటీ 21 మంది బీజేపీకి చెందిన ఎంపీలు ఉన్నారు. అదేవిధంగా 16 మంది సిట్టింగ్ ఎంపీలు మహిళలపై నేరాలకు సంబంధించిన ఆరోపణలను ఎదుర్కొంటున్నారు, ఇందులో మూడు అత్యాచార ఆరోపణలు ఉన్నాయి.

We’re now on WhatsApp : Click to Join

ప్రధాన పార్టీలలో బిజెపి మరియు కాంగ్రెస్‌లలో అత్యధిక సంఖ్యలో కోటీశ్వర ఎంపీలు ఉన్నారు. రాష్ట్రాల మధ్య క్రిమినల్ కేసుల్లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ఎంపీలలో 50 శాతానికి పైగా నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. వందల కోట్ల ఆస్తులున్న నకుల్ నాథ్ (కాంగ్రెస్), డికె సురేష్ (కాంగ్రెస్), కనుమూరు రఘు రామకృష్ణంరాజు (ఇండిపెండెంట్) అత్యధికంగా ఉన్నారు. కాగా 73 శాతం మంది ఎంపీలు గ్రాడ్యుయేట్ లేదా ఉన్నత విద్యార్హతలను కలిగి ఉన్నారు, సిట్టింగ్ ఎంపీలలో 15 శాతం మాత్రమే మహిళలు ఉన్నారు.

Also Read: KTR : నమ్మించి మోసం చేసిన ద్రోహులు వారు – కేటీఆర్