Corona Cases: భారతదేశంలో కొత్తగా 412 COVID-19 కేసులు నమోదయ్యాయి. అయితే ఇన్ఫెక్షన్ క్రియాశీల కేసుల సంఖ్య 4,170కి పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. ఉదయం 8 గంటలకు అప్డేట్ చేసిన మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. వైరల్ వ్యాధి కారణంగా మరణించిన వారి సంఖ్య 5,33,337 గా నమోదైంది. కర్ణాటక నుండి 24 గంటల వ్యవధిలో మూడు కొత్త మరణాలు నమోదయ్యాయి.
ప్రస్తుతం భారతదేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 4,50,09,660కి చేరుకుంది. మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ప్రకారం, వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 4,44,72,153కి పెరిగింది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతంగా ఉంది. కేసు మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటివరకు 220.67 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లు ఇవ్వబడ్డాయి.
కాగా దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కొత్త వేరియంట్ జేఎన్1 భయపడుతోంది. ఈ నేపథ్యంలో ఐటీ దిగ్గజం విప్రో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు వైరస్ బారినపడకుండా తగు చర్యలు తీసుకుంటోంది. అందుకోసం ఫ్లేక్సిబుల్ వర్క్ ప్లేస్ విధానాన్ని అవలంభిస్తున్నట్లు తెలిపింది. క్లయింట్ల అవసరాలకు అనుగుణంగా, వృత్తి పరమైన వృద్ధి కోసం ఉద్యోగుల శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇచ్చేందుకు సౌకర్యవంతమైన పని ప్రదేశాన్ని కల్పించనున్నట్లు పేర్కొంది.