Site icon HashtagU Telugu

Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో హృదయ విదారక ఘటన.. నలుగురు చిన్నారులు సజీవదహనం

fire

Resizeimagesize (1280 X 720) (1) 11zon

హిమాచల్ ప్రదేశ్‌ (Himachal Pradesh)లోని ఉనా జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. థానా అంబ్‌లోని బనే డి హట్టిలోని మురికివాడలో బుధవారం అర్థరాత్రి భీకర మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో నలుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక యంత్రాలు ప్రజల సహాయంతో మంటలను అదుపు చేశాయి. ఈ ఘోర ప్రమాదంలో నలుగురు చిన్నారులు మృతి చెందారు. మృతులు బీహార్‌కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారిగా సమాచారం.

సమాచారం ప్రకారం.. ఉనా జిల్లాలోని అంబ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బనే డి హట్టిలోని మురికివాడలో బుధవారం అర్థరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు చెలరేగడంతో నలుగురు వలస పిల్లలు సజీవ దహనమయ్యారు. పిల్లలందరూ మురికివాడలో టీవీ చూస్తున్నారు. అకస్మాత్తుగా మంటలు రావడంతో స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. వెంటనే మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. కానీ పిల్లలను రక్షించలేకపోయారు. చిన్నారుల మృతితో కుటుంబ సభ్యుల్లో విషాదం నెలకొంది.

Also Read: Greater Noida: గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. నలుగురు దుర్మరణం

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మురికివాడలో బుధవారం అర్థరాత్రి 11 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం కేసును ధృవీకరిస్తూ అగ్నిప్రమాదం కారణంగా 4 మంది మరణించారని ఎస్పీ ఉనా అర్జిత్ సేన్ ఠాకూర్ తెలిపారు.పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రాంతీయ ఆసుపత్రి ఉనాకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు డీఎస్పీ అంబి డాక్టర్ వసుధాసూద్ తెలిపారు.