Indian Warships : భారత్ అలర్ట్ అయింది. అరేబియా సముద్రంలో మూడు యుద్ధనౌకలను మోహరించింది. యుద్ధనౌకలు INS మొర్ముగో, INS కొచ్చి, INS కోల్కతాను రంగంలోకి దింపింది. ఇటీవల గుజరాత్లోని పోర్బందర్ తీరానికి సమీపంలోని అరేబియా సముద్రంలో ఇజ్రాయెలీ నౌకపై డ్రోన్ దాడి జరిగింది. ఈనేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా భారత్కు వచ్చే నౌకలకు రక్షణ కల్పించేందుకుగానూ యుద్ధనౌకలను(Indian Warships) మోహరించింది. దీంతోపాటు అరేబియా సముద్రంలో గస్తీ కోసం P-8I గస్తీ విమానాలను భారత నౌకాదళం వినియోగిస్తోంది. గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్లను కూడా వాడుతోంది. వెస్ట్రన్ నావల్ కమాండ్కు చెందిన మారిటైమ్ ఆపరేషన్స్ సెంటర్ కోస్ట్ గార్డ్ ఇతర అన్ని సంబంధిత ఏజెన్సీలతో కలిసి పనిచేస్తోంది.
We’re now on WhatsApp. Click to Join.