దేశ వ్యాప్తంగా జనవరి 3 వ తేదీ నుంచి టీనేజర్లకు వ్యాక్సినేషన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి దాదాపుగా దేశ వ్యాప్తంగా 20 మిలియన్లకు పైగా టీనేజర్లకు కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ అందించామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. “కోవిడ్-19కి వ్యతిరేకంగా పోరాడేందుకు యువ భారతదేశాన్ని రక్షించడం కోసం జనవరి 3 నుండి 15-18 సంవత్సరాల మధ్య వయస్సు గల 2 కోట్ల మంది పిల్లలకు కోవిడ్-19 టీకాలు వేశారు. టీకాలు వేసిన నా యువ స్నేహితులందరికీ అభినందనలు’ అని మాండవ్య ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉటంకిస్తూ వ్యాక్సిన్ వేసుకున్న టీనేజర్లను అభినందించారు, ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేసుకోని వారంతా వేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను కోరారు.
జనవరి 3వ తేదీ నుంచి 7 వ తేదీ మధ్య కాలంలో 1,715,615 మంది టీనేజర్లు(15-18 వయసు గల వారు) వ్యాక్సిన్ వేసుకున్నారు. ఈ వయస్సు విభాగంలో అత్యధిక వ్యాక్సినేషన్ నిర్వహించే రాష్ట్రాల జాబితాలో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాత తమిళనాడులో 1,463,079 మంది పిల్లలకు టీకాలు వేసింది. మహారాష్ట్రలో 1,483,478 మంది పిల్లలకు టీకాలు వేశారు. దేశ రాజధాని ఢిల్లీలో డ్రైవ్ ప్రారంభించినప్పటి నుండి 204,902 మంది పిల్లలకు టీకాలు వేశారు. టీనేజర్లకు అన్ని రాష్ట్రాలలో కోవాక్సిన్ని వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెండు డోసుల మధ్య 28 రోజులు వేచి ఉండాల్సిన అవసరం ఉంది.
టీనేజర్లకు వీలైనంత త్వరగా టీకాలు వేయడం తప్పనిసరి డాక్టర్ పీయూష్ గుప్తా తెలిపారు. 15-18 సంవత్సరాల వయస్సుగల వారికి వ్యాక్సినేషన్ ప్రాధాన్యత ఉందని.. ఎందుకంటే వీరు వచ్చే రెండు నెలల్లో పరీక్షలకు వెళ్లనున్నారని డాక్టర్ గుప్తా చెప్పారు. వారు పరీక్షలకు హాజరు కావాలని..పరీక్షా హాళ్లలో కూర్చుని ఇతర విద్యార్థులతో కలిసిపోవాలి కాబట్టి వీరికి వ్యాక్సినేషన్ త్వరగా పూర్తి చేయాలన్నారు.
Excellent! Well done my young friends.
Let us continue this momentum.
Urging everyone to follow all COVID-19 related protocols and get vaccinated, if you haven’t already. https://t.co/h6TCS0BDkU
— Narendra Modi (@narendramodi) January 8, 2022