Site icon HashtagU Telugu

Illegally Entered India: 16 మంది చొరబాటుదారులు అరెస్ట్.. 12 మంది విదేశీ పౌరులు

Illegally Entered India

Resizeimagesize (1280 X 720) 11zon (1)

భారత్‌లోకి అనధికారికంగా చొరబడిన (Illegally Entered India) 16 మందిని అరెస్ట్ చేసినట్లు త్రిపుర రైల్వే పోలీసులు వెల్లడించారు. వారిలో 12 మంది విదేశీయులని, వారిని అగర్తల రైల్వేస్టేషన్ సమీపంలో అరెస్ట్ చేశామని తెలిపారు. వాళ్లంతా కోల్‌కతా వెళ్లే రైలు ఎక్కేందుకు ప్లాన్ చేశారని ప్రభుత్వ రైల్వే పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ రాణా చటర్జీ తెలిపారు. వారందరికీ మెడికల్ పరీక్షలు చేయించిన అనంతరం కోర్టులో ప్రవేశపెడతామని పేర్కొన్నారు.

భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించినందుకు త్రిపురలోని అగర్తల రైల్వే స్టేషన్‌లో 12 మంది విదేశీ పౌరులతో సహా 16 మందిని రైల్వే పోలీస్ ఫోర్స్ (RPF) అదుపులోకి తీసుకుంది. ఈ మేరకు ఆదివారం అధికారులు సమాచారం అందించారు. ప్రభుత్వ రైల్వే పోలీస్ (GRP) స్టేషన్ ఇన్‌ఛార్జ్ రాణా ఛటర్జీ మాట్లాడుతూ.. ఒక ఇన్‌పుట్ ఆధారంగా RPF ముగ్గురు పిల్లలతో సహా మొత్తం 16 మందిని స్టేషన్ నుండి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఇందులో 12 మంది విదేశీ పౌరులు (ఇద్దరు బంగ్లాదేశీయులు, 10 మంది రోహింగ్యాలు) ఉన్నారు.

Also Read: Bus Falls Into Gorge: ఘోర ప్రమాదం.. జమ్మూకశ్మీర్‌లో లోయలో పడిన బస్సు

అదుపులోకి తీసుకున్న నిందితుల్లో మధుపూర్‌కు చెందిన అభిజీత్ దేబ్ అనే మధ్యవర్తి కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరంతా బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు. వారు అగర్తలా రైల్వే స్టేషన్ నుండి ఉదయం 8:05 గంటలకు కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌లో కోల్‌కతాకు వెళ్లాల్సి ఉంది. కోర్టులో హాజరుపరిచే ముందు నిందితులను వైద్య పరీక్షల నిమిత్తం పంపించారు. పోలీసులు నిందితులను విచారించి అక్రమంగా ఆక్రమణలకు పాల్పడిన దారిని ఆరా తీస్తున్నారు. ఈ విషయంలో తదుపరి విచారణ కొనసాగుతోంది.