Site icon HashtagU Telugu

110 Voters : ఆ ఫ్యామిలీలో 165 మంది.. ఓట్ల కోసం లీడర్ల క్యూ

110 Voters

110 Voters

110 Voters : బిహార్‌కు చెందిన ఆ ఒక్క కుటుంబంలో 165 మంది సభ్యులు ఉన్నారు. వారిలో 110 మంది ఓటర్లే. వీరంతా జూన్ 1న  జరగనున్న తుది విడత పోలింగ్‌లో ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఈ స్పెషల్ ఫ్యామిలీ పాట్నా నగరంలో ఉంది.  ఈ 165 మంది కలిసి నివసించే మెగా ఇంటి పేరు ‘చందేల్​ నివాస్​’ . ఈ ఫ్యామిలీలో కొత్తగా 10మందికి ఓటు హక్కు వచ్చింది. వీరిలో నలుగురు అబ్బాయిలు, ఆరుగురు అమ్మాయిలు ఉన్నారు. పట్నాలోని రెండు పోలింగ్​ కేంద్రాల్లో ఈ కుటుంబ సభ్యులంతా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ కుటుంబం పెద్దది కావడంతో ఓట్ల కోసం ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు వీరి ఇంటిచుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇంకా అభ్యర్థులు ఎవరూ తమ ఇంటికి రాలేదని సీనియర్ కుటుంబ సభ్యుడు 74 ఏళ్ల అరుణ్​ కుమార్​ సింగ్ తెలిపారు. అభ్యర్థుల స్థానిక అనుచరులు వస్తారని ఆయన వెల్లడించారు. మే 31న కుటుంబంలోని సభ్యులమంతా సమావేశమై అభ్యర్థిపై ఓ నిర్ణయానికి వస్తామని స్పష్టం చేశారు.

We’re now on WhatsApp. Click to Join

ఈ ఫ్యామిలీ నేపథ్యం ఇదీ.. 

Also Read :PM Modi Meditation : కన్యాకుమారిలో రెండు రోజులు ప్రధాని మోడీ మెడిటేషన్