Hyderabad: హైదరాబాద్ లో సరి-బేసి విధానం

నగరంలో పెరుగుతున్న కాలుష్యం, ట్రాఫిక్‌ రద్దీని అరికట్టేందుకు సరి-బేసి విధానాన్ని అవలంబిస్తున్నట్లు తెలిపారు నగర పోలీసు కమిషనర్‌ కె.శ్రీనివాసరెడ్డి. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు

Hyderabad: నగరంలో పెరుగుతున్న కాలుష్యం, ట్రాఫిక్‌ రద్దీని అరికట్టేందుకు సరి-బేసి విధానాన్ని అవలంబిస్తున్నట్లు తెలిపారు నగర పోలీసు కమిషనర్‌ కె.శ్రీనివాసరెడ్డి. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు న్యూఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం బేసి-సరి విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం నంబర్ ప్లేట్‌లు సరి అంకెలతో (0, 2,4,6,8) ముగిసే వాహనాలు సరి తేదీలలో, బేసి అంకెలతో (3,5,7,9) ముగిసేవి బేసి తేదీలలో పనిచేస్తాయి. ఈ నేపథ్యంలో సరి-బేసి విధానాన్ని అమలు చేసే ఆలోచనను అన్వేషించడానికి ట్రాఫిక్ విభాగం సిద్ధంగా ఉందని చెప్పారు.

ఢిల్లీ, బెంగళూరు, ముంబై వంటి మెట్రో నగరాల్లో కార్‌పూలింగ్‌ను ఉపయోగిస్తున్నారు. వనరులను ఆదా చేయడం మరియు కాలుష్యాన్ని అరికట్టడంలో ఇది ఉత్తమమైనది. హైదరాబాద్ కూడా దీన్ని అమలు చేయాలని నేను భావిస్తున్నాను అని ఆయన విలేకరులతో అన్నారు. కాగా.. 2023లో సిటీలో కొత్తగా 16 వేల 150 వెహికిల్స్ యాడ్‌ అయ్యాయి. అక్టోబర్ 31 నాటికి సిటీలో రిజిస్టర్ అయిన వెహికిల్స్ సంఖ్య 85 లక్షలుగా ఉంది. 2014లో ఈ సంఖ్య 42 లక్షలుగా మాత్రమే ఉంది. దాదాపు పదేళ్ల కాలంలో సిటీలో వెహికిల్స్ సంఖ్య రెట్టింపయింది.

Also Read: Mangalavaaram : పాయల్ రాజ్‌పుత్ సూపర్ హిట్ సినిమా ‘మంగళవారం’ ఓటీటీలోకి.. ఎందులో? ఎప్పటి నుంచి?