ప్రస్తుతం చాలామంది మధుమేహం సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. రోజురోజుకీ ఈ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది.. అయితే ఈ డయాబెటిస్ ఒక్కసారి వచ్చింది అంటే చాలు చచ్చే వరకు పోదు అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ మార్కెట్లో దొరికే కొన్ని మెడిసిన్స్ ని ఉపయోగించి ఈ డయాబెటిస్ ని అదుపులో పెట్టుకోవచ్చు. అయితే డయాబెటీస్ ను నియంత్రణలో ఉండానికి ఫుడ్ ఎంతో సహాయపడుతుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే.
కానీ ఏవి పడితే అవి తింటే మాత్రం రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరుగుతాయి. ఒకవేళ మధుమేహం ఉన్నవారు బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పొరపాటున కూడా షుగర్ పేషెంట్లు బ్రేక్ ఫాస్ట్ ని స్కిప్ చేయకూడదట. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ టైం షుగర్ పేషెంట్లకు చాలా కీలకము అని చెబుతున్నారు. ఇది వారిని రోజంతా ఎనర్జిటిక్ గా ఉంచడంతో పాటు రక్తంలో చక్కర స్థాయిలను కూడా నియంత్రణలో ఉంచుతుందట. అందుకే మధుమేహం ఉన్నవారు పొరపాటున కూడా బ్రేక్ ఫాస్ట్ ని స్కిప్ చేయకూడదని చెబుతున్నారు. డయాబెటిస్ ఉన్న వారి శరీరం ఇన్సులిన్ ను సరిగ్గా ఉపయోగించుకోలేదు.
లేదా ఇన్సులిన్ ను సరిగ్గా ఉత్పత్తి చేయదు. అయితే రెగ్యులర్ వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం, ఒత్తిడిని తగ్గించడం, కంటినిండా నిద్ర వంటివి డయాబెటిస్ ను నియంత్రించడానికి బాగా సహాయపడతాయని చెబుతున్నారు. అయితే బిజీలైఫ్ స్టైల్ వల్ల చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ ను చేయడం మర్చిపోతుంటారు. లేదా టైం లేదని స్కిప్ చేస్తుంటారు. కానీ డయాబెటిస్ పేషెంట్లు ఉదయం ఏమీ తినకపోతే రోజంతా రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడం చాలా కష్టం అవుతుందని చెబుతున్నారు. ఎందుకంటే శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ నేచురల్ గా ఎక్కువగా ఉండే సమయం ఉదయమే. నిద్రలేచిన వెంటనే మీ శరీరం కార్టిసాల్ వంటి హార్మోన్లను విడుదల చేస్తుంది. కాబట్టి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు సహజంగా పెరుగుతాయి.
ఈ సమయంలో అల్పాహారం తినకపోవడం వల్ల అప్పటికే పెరిగిన గ్లూకోజ్ స్థాయిలు మరింత పెరుగుతాయి. ఇది రక్తంలో చక్కెర పెరుగుదలకు దారి తీస్తుంది. అలాగే రోజంతా డయాబెటిస్ ను నియంత్రించడం కష్టంగా మారుతుంది. బ్రేక్ ఫాస్ట్ మానేస్తే శరీరంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ సేపు తినకపోవడం వల్ల మైకము, బద్ధకం లేదా దృష్టి పెట్టడంలో ఇబ్బంది వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఉదయం నిద్రలేచిన ఒకటి లేదా రెండు గంటల తర్వాత బ్రేక్ ఫాస్ట్ ను తప్పకుండా తినాలని చెబుతున్నారు.