దానిమ్మ పండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు అన్న విషయం అందరికీ తెలిసిందే. దీనిని అనేక జ్యూస్ ల తయారీలలో ఉపయోగిస్తూ ఉంటారు. దానిమ్మ పండును కొంతమంది జ్యూస్ రూపంలో తీసుకుంటే మరికొంత మంది సలాడ్, లేదా ఇతర రూపాల్లో తీసుకుంటూ ఉంటారు. అయితే ఎన్నో ప్రయోజనాలు ఉన్న దానిమ్మ పండును ప్రతీ రోజు తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ హెల్తీ పండులో ప్రోటీన్, ఫైబర్, ఫోలేట్, పొటాషియం, విటమిన్ సి వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.
రోజూ ఒక దానిమ్మ పండును తినే వారికి రోగాలు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుందట. మీరు గనుక ఒక 15 రోజుల పాటు దానిమ్మ పండును తింటే మీ శరీరంలో ఎన్నో మార్పులు కనిపిస్తాయట. దానిమ్మ పండు జ్యూస్ బ్లడ్ క్లెన్సింగ్ గా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనిలో ఉండే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు మన రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయట. అలాగే శరీరంలో ఉండే విష సమ్మేళనాలను కూడా బయటకు పంపుతాయట. ఇది మీ రక్తాన్ని శుభ్రపరుస్తుందట. దానిమ్మ పండును మీరు గనుక 15 రోజుల పాటుగా తింటే మీ శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుందట.
అలాగే దానిమ్మలో ఉండే పాలీఫెనాల్ సమ్మేళనాలు మన గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయట. అలాగే గుండెపోటు, స్ట్రోక్ వంటి గుండెజబ్బులు వచ్చే ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తాయట. దానిమ్మ పండులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాల నష్టాన్ని నివారించడానికి బాగా సహాయపడతాయట. వీటిని రోజూ ఒకటి తింటే క్యాన్సర్ ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని చెబుతున్నారు. దానిమ్మ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో మనకు అంటు వ్యాధులు, ఇన్ఫెక్షన్లు, దగ్గు, జలుబు వంటి అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుందట.
కాగా దానిమ్మ పండులో డైటరీ ఫైబర్ మెండుగా ఉంటుందట. ఇది మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి సహాయపడుతుందట. దానిమ్మ పండులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే మీరు బరువు తగ్గాలనుకుంటే దానిమ్మను తినాలని, దానిమ్మ బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఈ పండును 15 రోజుల పాటు తింటే తేడా మీకే కనిపిస్తుందట. దానిమ్మ పండులో ఆక్సలేట్స్, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయట. ఇవి మీ కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా కాపాడుతాయట. దానిమ్మ పండును తింటే కిడ్నీ స్టోన్స్ కూడా తగ్గిపోతాయట.