చాలామంది పెరుగు కొంచెం స్మెల్ రాగానే లేదంటే పులుపు వాసన రాగానే వెంటనే పాటిస్తూ ఉంటారు. ఇంకొందరు మొక్కలు ఉన్నవారు మొక్కల కోసం అలా ఉపయోగిస్తూ ఉంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే పుల్లటి పెరుగు వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయట. దోస స్పాంజి తరహాలో మెత్తగా, మృదువుగా రావాలంటే అందులో సాధారణ పెరుగుకు బదులు పుల్లటి పెరుగును జత చేయాలని చెబుతున్నారు. తద్వారా అది తింటుంటే నోటికి ఒక రకమైన పులుపుదనం తగిలి మరింత రుచికరంగా ఉంటుందని వివరిస్తున్నారు. అలాగే జొన్న పిండి, రాగి పిండి, రవ్వతో అప్పటికప్పుడు ఇన్స్టెంట్ దోసెలు వేసుకునే వారు నీళ్లతో పాటు కాస్త పుల్లటి పెరుగుతో పిండి మిశ్రమాన్ని కలుపుకొంటే వాటి రుచి పెరుగుతుందని చెబుతున్నారు. పెరుగు పుల్లగా మారింది అంటే దాని రుచి, ఆకృతి నాశనం చేస్తుంది.
పుల్లటి పెరుగు అందరి హెల్త్ కి సెట్ కాదు. అలా కాకుండా పుల్లటి పెరుగు తినాలి అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పుల్లని పెరుగును శీతలీకరించి, గాలి చొరబడని, శుభ్రమైన కంటైనర్ లో ఉంచాలి. పెరుగును సరిగ్గా నిల్వ చేయనప్పుడు, ప్రమాదకరమైన సూక్ష్మ క్రిములు వృద్ధి చెందుతాయి. తినడానికి అనారోగ్యకరంగా మారుతాయి. లాక్టోస్, లేదా పాల చక్కెర, లాక్టిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేయడానికి బ్యాక్టీరియా ద్వారా పులియబెడతారు. ఇది పెరుగును పుల్లగా చేస్తుంది. ఈ సహజ ప్రక్రియ ద్వారా పెరుగు ఎక్కువ కాలం పులియబెట్టడానికి అనుమతిస్తారు. కిణ్వ ప్రక్రియ ఎంత సమయం పడుతుంది. ఏ పరిస్థితులలో ఆధారపడి ఉంటుంది అనేదానిపై ఆధారపడి, పుల్లని రుచి కొద్దిగా చిక్కగా ఉండటం నుండి చాలా పుల్లగా ఉంటుంది.
అయితే పెరుగు ఎక్కువ పులిసి పోకుండా, చెడిపోకుండా ఉండటానికి, పెరుగును ఎల్లప్పుడూ స్థిరమైన ఉష్ణోగ్రత వద్ద రిఫ్రిజిరేటర్ లో ఉంచాలి. పెరుగును ఉంచే పాత్రలను కూడా చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. కలుషితాలను ప్రవేశపెట్టకుండా ఉండటానికి పెరుగును బయటకు తీయడానికి శుభ్రమైన పాత్రలను ఉపయోగించాలి. పుల్లటి పెరుగు తినడానికి ఇష్టపడని వారు వాటిని పండ్లు లేదా తృణధాన్యాలతో కలిపి తీసుకోవచ్చు. రాత్రిపూట అస్సలు తినకూడదు. రాత్రిపూట తినడం వల్ల క్డుపులో ఇబ్బందిగా మారవచ్చు. కాబట్టి పగటి పూట మాత్రమే తినాలి. ఇక పుల్లటి పెరుగు తినే సమయంలో కడుపులో ఏదైనా ఇబ్బందిగా, అసౌకర్యంగగా అనిపిస్తే దానిని తినడం ఆపేయడమే మంచిదని చెబుతున్నారు.