మనలో చాలామంది ఫుడ్ లో కొన్ని రకాల కాంబినేషన్స్ తినడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అటువంటి వాటిలో పెరుగు ఉల్లిపాయ కాంబినేషన్ కూడా ఒకటి. చాలామంది పెరుగన్నం తిన్నప్పుడు నంజుకోవడానికి ఉల్లిపాయ తింటూ ఉంటారు. ఇంకొందరు నాన్ వెజ్ చేసినప్పుడు పెరుగు పచ్చడి అని చెప్పి దోసకాయ, ఉల్లిపాయ అన్ని కలిపి చేస్తూ ఉంటారు. ఈ విధంగా పెరుగు తీసుకున్నప్పుడు చాలామంది ఉల్లిపాయ కూడా తింటూ ఉంటారు. అయితే నిజానికి పెరుగుతో పాటు ఉల్లిపాయ కలిపి తినడం మంచిదేనా? ఈ విషయం గురించి వైద్యులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పెరుగు, ఉల్లిపాయ కలిపి అస్సలు తినకూడదట.
ఇలా చేయడం వల్ల మీరు ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని, ముఖ్యంగా జీర్ణ సంబందిత సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుందని, ఇప్పటికే జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు పెరుగు ఉల్లిపాయ కలిపి తీసుకోకపోవడమే మంచిదని చెబుతున్నారు. ఉల్లిపాయ, పెరుగు రెండూ విభిన్న ప్రభావాన్ని కలిగి ఉంటాయట. అంటే ఉల్లిపాయ వేడిచేసే ప్రభావాన్ని కలిగి ఉంటుంది. పెరుగు చలువ చేసే ప్రభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి వీటిని కలిపి తినక పోవడమే మంచిదని చెబుతున్నారు. ఉల్లిపాయల్లో ఉండే సమ్మేళనాలు మనకు గ్యాస్ట్రిక్, ఎసిడిటీ వంటి సమస్యలు వచ్చేలా చేస్తాయట.
ఇకపోతే పెరుగులో ఉండే సమ్మేళనాలు కూడా ఇంచుమించు ఇదే ప్రభావాన్నిచూపిస్తుందని, ఇలాంటి పరిస్థితిలో మీరు ఈ రెండింటినీ కలిపి తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ తో పాటుగా అజీర్ణ సమస్యల బారిన పడాల్సి వస్తుందని చెబుతున్నారు. అలాగే పెరుగులో చలువ చేసే లక్షణాలు ఉంటాయి. ఉల్లి సల్ఫర్ కంటెంట్ వల్ల వేడి స్వభావాన్ని కలిగి ఉంటుందట. మీరు పెరుగును, ఉల్లిపాయను కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో అధిక వేడి ఉత్పత్తి అవుతుందట. ఇది టాక్సిన్స్ లెవెల్ ను పెంచుతుందట. దీంతో మీ చర్మంపై దద్దుర్లు, తామర, సోరియాసిస్ తో పాటగుా ఇతర చర్మ అలెర్జీలు కూడా వస్తాయి అని చెబుతున్నారు. పెరుగు, ఉల్లిపాయను కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలు వస్తాయట. ఎందుకంటే పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఉల్లిపాయల్లో సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి.
ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి అని చెబుతున్నారు. అదేవిధంగా పెరుగులో ఉల్లిపాయలు కలిపి తీసుకుంట హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి మీ శరీరంలో అదనపు వేడిని ఉత్పత్తి అవుతుందట. ఇది మీ శరీరంలో టాక్సిన్స్ స్థాయిని పెంచుతుందని చెబుతున్నారు. ఇది తామర, దద్దుర్లతో పాటుగా కొన్ని కొన్ని సార్లు సోరియాసిస్ వంటి చర్మ అలెర్జీలకు కూడా దారితీస్తుందట. దీని పర్యావసానం ఎక్కువగా ఉంటే ఫుడ్ పాయిజనింగ్ బారిన కూడా పడవచ్చు అని చెబుతున్నారు. ఉల్లిపాయలను వేయిస్తే వాటిలోని సామర్థ్యం తగ్గుతుందట. కాబట్టి మీరు ఉల్లిపాయల్ని వేయించి పెరుగులో కలిపి తినవచ్చు అని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రావట.