Fish: వర్షాకాలంలో దొరికే చేపలు తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

చాలామందికి చేపలు అంటే చాలా ఇష్టం. కనీసం వారానికి ఒక్కసారి అయినా చేపలు తినకపోతే ఎలాగో ఉంటుందని చెబుతూ ఉంటారు. చేపలు ఎన్నో రకాల చే

  • Written By:
  • Publish Date - September 14, 2023 / 09:07 PM IST

చాలామందికి చేపలు అంటే చాలా ఇష్టం. కనీసం వారానికి ఒక్కసారి అయినా చేపలు తినకపోతే ఎలాగో ఉంటుందని చెబుతూ ఉంటారు. చేపలు ఎన్నో రకాల చేపలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. వైద్యులు కూడా చేపలను తినమని చెబుతూ ఉంటారు. ఇతర సీజన్ లతో పోల్చుకుంటే వర్షాకాలంలో చేపలు తినే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కానీ వర్షాకాలంలో చేపలను తినడం మంచిది కాదు అంటున్నారు వైద్యులు.. మరి వర్షాకాలంలో చేపలను ఎందుకు తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వర్షాకాలం అనేది చేపలకు గుడ్లు పెట్టి పొదిగే కాలం. మీకు దొరికే చేపలన్నీ అంతకుముందే పట్టి ఫ్రీజర్లో దాచి అమ్ముతూ ఉంటారు.

వానాకాలంలో సముద్రంలో చేపలు పట్టేందుకు అనుమతి లేదు. భారీ వర్షాలు, గాలి ఉన్నప్పుడు ఎవరు చేపలు పట్టేందుకు వెళ్లరు. కాబట్టి మనకు వానా కాలంలో దొరికే చేపలు అన్నీ కూడా ఫ్రీజర్ లో కొన్ని రోజులపాటు నిల్వచేసిన చేపలే. ఇలా నిలువ చేసేందుకు కొన్ని రసాయనాలను కూడా ఉపయోగిస్తుంటారు. కాబట్టి అలాంటి చేపలను కొనక పోవడమే మంచిది. లేకుంటే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంది. ఫ్రీజర్లో కొన్ని రోజులపాటు ఉంచిన చేపలు చప్పగా అయిపోతాయి. వాటిలో ఎలాంటి నాణ్యత ఉండదు. చూసేందుకు చేపలే కానీ వాటిని వండుకొని తింటే రుచి ఎంత చెత్తగా ఉంటుంది. అంతేకాదు వర్షాకాలంలో కలుషిత నీరు నదులు, సముద్రాల్లో ప్రవేశిస్తాయి. ఆ సమయంలో ఆ నీటిలోనే చేపలు గుడ్లు పెడతాయి. కాబట్టి ఆ కలుషిత నీటిలో ఉన్న చేపలను పట్టి అమ్ముకునే వారు కూడా ఉన్నారు.

అలాంటి చేపలు తినడం వల్ల పచ్చకామెర్లు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వానాకాలంలో రెండు నెలలు పాటు చేపలు పూర్తిగా తినక పోవడమే మంచిది. తాజాగా కనిపించేలా చేయడం కోసం సల్ఫేట్లు, ఫాలీఫాస్పేట్లు వంటి రసాయనాలు వాడతారు. ఇవి మన ఆరోగ్యానికి హాని చేసేవి. కాబట్టి వానాకాలం ముగిసే వరకు చేపలకు దూరంగా ఉంటే ఎంతో మంచిది. భారీ వర్షాలు పడేటప్పుడు చేపలు, రొయ్యలు వంటివి తినడం వల్ల టైఫాయిడ్, పచ్చకామెర్లు, డయేరియా వంటివి వచ్చే అవకాశం ఎక్కువ. సైనసైటిస్, మైగ్రేన్, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు వంటివి వానాకాలంలోని చేపలు తినడం వల్ల వస్తాయి. వానాకాలం దాటాక మిగతా కాలాల్లో చేపలు తినడం వల్ల మాత్రం ఆరోగ్యం బావుంటుంది. కాబట్టి వర్షాకాలంలో చేపలకు బదులుగా చికెన్ మటన్ వంటివి తినడం మంచిది.