కీర దోసకాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. దోసకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా సమ్మర్ లో ఈ కీర దోసకాయను ఎక్కువగా తింటూ ఉంటారు. ఇంతకీ సమ్మర్ లోనే కీర దోసకాయను ఎందుకు ఎక్కువగా తినాలి. దీని వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కీరక దోసకాయలు నీటి శాతం ఎక్కువగా ఉంటుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. వేసవి కాలంలో కీర దోసకాయ తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన నీటి శాతం అందుతుంది. అలాగే కీరదోసకాయలను తింటే బాడీ డీహైడ్రేట్ అయ్యే అవకాశం కూడా ఉండదట. దోసకాయలు కేవలం ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా అందాన్ని కూడా కాపాడతాయని చెబుతున్నారు. అలాగే ఈ కీర దోసకాయలు మిమ్మల్ని చల్లగా కూడా ఉంచుతాయట. కీరదోసకాయలో నీటితో పాటుగా ఎన్నో ముఖ్యమైన పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయట. వీటిలో విటమిన్ కె, విటమిన్ సి, పొటాషియం లు మెండుగా ఉంటాయట. ఇవి మన ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతాయట. అలాగే మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయట. అలాగే ఎలక్ట్రోలైట్ సమతుల్యతను నిర్వహించడానికి కూడా సహాయపడతాయని చెబుతున్నారు.
కాగా కీరదోసకాయలలో కేలరీలు తక్కువగా ఉంటాయట. అలాగే వాటర్, ఫైబర్ కంటెంట్ లు ఎక్కువగా ఉంటాయట. ఇవి మీరు బరువు పెరగకుండా చేయడానికి బాగా సహాయపడతాయని, వీటిని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఆకలి తగ్గుతుందని చెబుతున్నారు.అలాగే కేలరీలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినకుండా చేస్తుందట. దీంతో సులువుగా బరువు తగ్గవచ్చని చెబుతున్నారు. అలాగే వేసవిలో ఎండల వల్ల మన చర్మం బాగా ప్రభావితమవుతుందన్న విషయం తెలిసిందే. అయితే కీరదోసకాయలలో సిలికాన్ డయాక్సైడ్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది చర్మ స్థితిస్థాపకత, ఆర్ద్రీకరణకు సహాయపడుతుందట. కీరదోసకాయ ముక్కలు లేదా కీరదోసకాయ కలిగిన పదార్థాలను ఉపయోగించి సూర్యరశ్మి సంబంధిత చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చని,ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుందని చెబుతున్నారు.
కీరదోసకాయలలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుందట. వీటిని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల పేగు కదలికలు మెరుగుపడతాయని కడుపు అసౌకర్యం, ఉబ్బరం సమస్యలు కూడా తగ్గుతాయని అవుతున్నారు. అంతేకాకుండా మలబద్దకం సమస్య కూడా ఉండదట. కీరదోసకాయలో సహజ శ్వాస రిఫ్రెష్ లక్షణాలు ఉంటాయట. ఇవి ఎండను తట్టుకోవడానికి సహాయపడతాయని, కీరదోసకాయను తింటే నోటి దుర్వాసన కూడా రాదని టిలో ఉండే ఫైటోకెమికల్స్ నోటి దుర్వాసనతో పోరాడి లోపలి నుంచి తాజా శ్వాసకు సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..