Periods: చాలా మంది అమ్మాయిలకు పీరియడ్స్ సమయానికి రాకపోవడం (Periods) అనేది సర్వసాధారణ సమస్యగా మారింది. దీని కారణంగా వారు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నేటి వేగవంతమైన జీవనశైలి, ఒత్తిడి కారణంగా ఈ క్రమరహిత రుతుస్రావం సమస్య పెరుగుతోంది. ఇది దాదాపు ప్రతి అమ్మాయిలో కనిపిస్తోంది. మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతుంటే ప్రతి నెలా పీరియడ్స్ సమయానికి రావాలంటే గోరువెచ్చని నీటిలో ఏ ప్రత్యేక పదార్థాన్ని కలిపి తాగితే ఈ సమస్య దూరమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
గోరువెచ్చని నీటిలో నెయ్యి కలిపి తాగండి
మీకు పీరియడ్స్ సమయానికి రాకపోతే లేదా మీకు చాలా నొప్పి ఉంటే నెలలో 3-4 రోజులు ఒక చెంచా నెయ్యిని (Ghee) గోరువెచ్చని నీటిలో (Warm Water) కలిపి తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా పీరియడ్స్ రాకపోతే 10 వేప ఆకులను (Neem Leaves) తీసుకుని చట్నీ చేసి, అదే నెయ్యి కలిపిన నీటితో కలిపి సేవించాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వలన పీరియడ్స్ సకాలంలో రావడంతో పాటు అండాలు కూడా బాగా ఉత్పత్తి అవుతాయి. వంధ్యత్వం (Infertility) వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
Also Read: Online Sales: జీఎస్టీ తగ్గింపుతో పండుగ సందడి.. కొనుగోళ్ల జోరు, ఈ-కామర్స్ రికార్డులు!
ప్రయోజనాలు
గోరువెచ్చని నీటిలో నెయ్యి కలిపి తాగడం వలన పీరియడ్స్ క్రమబద్ధీకరించడానికి (Regular Periods) సహాయపడుతుంది. అంతేకాకుండా పీరియడ్స్ సమయంలో మీకు నొప్పి ఎక్కువగా ఉంటే మీరు మొదటి రోజు నుంచే దీనిని తాగడం మొదలుపెట్టవచ్చు. ఇది నొప్పి నుండి ఉపశమనం అందించడానికి సహాయపడుతుంది. ఈ విధానం సహజమైనది. శరీరాన్ని లోపలి నుండి పోషిస్తుంది. దీనివల్ల హార్మోన్ల సమతుల్యత (Balance Hormones) మెరుగుపడుతుంది. అదనంగా వేప ఆకుల చట్నీతో ఈ నెయ్యిని తీసుకోవడం పీరియడ్స్ను సమయానికి తీసుకురావడంలో సహాయపడుతుంది. మహిళల పునరుత్పత్తి వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది.