Diabetes Patients : మధుమేహం ఉన్నవారు ఈ పండ్లు మాత్రమే తినాలి..!

పండ్లు (Fruits) ఆరోగ్యానికి ఎంతో మేలు.. కానీ పండ్లలో ఫ్రక్టోస్ అనే తీపి పదార్థం ఉంటుంది.

పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు.. కానీ పండ్లలో ఫ్రక్టోస్ అనే తీపి పదార్థం ఉంటుంది. దీంతో రక్తంలో షుగర్ పెరిగిపోతుందేమోనన్న భయం వారిని వేధిస్తుంటుంది. నిజానికి రోజువారీ పండ్లు తీసుకుంటే మధుమేహం (Diabetes) రిస్క్ తగ్గుతుందని ఎన్నో అధ్యయనాలు అన్ని రకాల పండ్లు తినేస్తానంటే కుదరదు. ఎందుకంటే కొన్ని పండ్లలో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే తిన్న వెంటనే వేగంగా జీర్ణమై, రక్తంలోకి చక్కెరలు వేగంగా విడుదల అవుతుంటాయి. అందుకని గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న పండ్లను మధుమేహులు తినాల్సి ఉంటుంది. జీఐ తక్కువగా ఉన్న పండ్లు నిదానంగా జీర్ణమవుతూ, రక్తంలోకి క్రమంగా చక్కెరలు విడుదల చేస్తాయి. గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న పండ్లను తినొచ్చు కానీ, పరిమితంగానే తినాలి.

ముఖ్యంగా మధుమేహులు 150-200 గ్రాముల వరకు పండ్లను తినొచ్చు. ఒకవేళ షుగర్ అధికంగా ఉంటే కనుక పండ్ల పరిమాణం 100-150 గ్రాములకు తగ్గించుకోవాలి. గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న పండ్లను కూడా తినొచ్చు. కానీ, వాటి పరిమాణం 100 గ్రాములు మించకూడదు. ఇక మధుమేహంతో బాధపడేవారు బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ తో కలిపి పండ్లు తినకూడదు. ఎందుకంటే టిఫిన్, భోజంతో కార్బోహైడ్రేట్లు అధికంగా మన రక్తంలోకి చేరతాయి.

మధుమేహంతో (Diabetes) ఉన్నవారు యాపిల్, జామపండు, కమలా/నారింజ, బొప్పాయి, వాటర్ మెలాన్ తీసుకోవచ్చు. ఇవి చాలా మంచివి. వీటిల్లో ఫ్యాట్, క్యాలరీలు, సోడియం చాలా తక్కువ. పైగా వీటిల్లో విటమిన్ సీ, పొటాషియం, పీచు లభిస్తాయి. పొటాషియం రక్తపోటుని నియంత్రిస్తుంది. కణజాల నిర్మాణానికి, మరమ్మతులకు విటమిన్ సీ కావాలి. పళ్ల చిగుళ్లు ఆరోగ్యంగా ఉండాలన్నా విటమిన్ సీ అవసరం. బీ విటమిన్లు యాపిల్, మెలాన్ పండ్లు, బొప్పాయిలో లభిస్తాయి. పండ్ల రసం కంటే మొత్తం పండుగా తినాలి. దీనివల్ల పీచు లభించి జీర్ణ ప్రక్రియకు సాయపడుతుంది మధుమేహం (Diabetes) ఉన్న వారు సపోటా, మామిడి పండు, అరటి పండు, ద్రాక్ష పండ్లు, ఎట్టి పరిస్థితుల్లోనూ తినొద్దు. పనస తొనలు చాలా తక్కువగా తినాలి.

Also Read:  First Robot Lawyer : ప్రపంచంలోనే తొలి రోబో లాయర్..!