Site icon HashtagU Telugu

Fruits : ఖాళీ కడుపుతో ఈ పండ్లు అస్సలు తినకండి.. నిర్లక్ష్యం చేస్తే మీ ఆరోగ్యానికి డేంజర్!

Fruits

Fruits

Fruits : ఉదయాన్నే లేవగానే పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని మనలో చాలా మంది నమ్ముతారు. ఇందులో నిజం ఉన్నప్పటికీ, ఏ పండును ఎప్పుడు తినాలనే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఖాళీ కడుపుతో కొన్ని పండ్లను తినడం వల్ల ప్రయోజనాలకు బదులుగా కొన్నిసార్లు ఇబ్బందులు తలెత్తవచ్చు. ప్రతి పండుకు దాని సొంత గుణం ఉంటుంది.అది మన జీర్ణవ్యవస్థపై విభిన్న రకాలుగా ప్రభావం చూపుతుంది.

పొప్పయా, ఆపిల్: మంచి ఆరంభం

ఖాళీ కడుపుతో తినడానికి పొప్పయా (బొప్పాయి) ఒక అద్భుతమైన పండు. దీనిలో ఉండే ‘పపైన్’ అనే ఎంజైమ్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది కడుపును శుభ్రపరచడంలో సహాయపడుతుంది. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది.కానీ, ఖాళీ కడుపుతో తినడం వలన అధికంగా ఆకలి అవుతుంది. మంట సమస్య కూడా తలెత్త వచ్చు. అలాగే, ఆపిల్‌ను పరగడుపున తినడం కూడా చాలా మంచిది. దీనిలోని ఫైబర్ (పీచుపదార్థం) యాంటీ ఆక్సిడెంట్లు జీర్ణవ్యవస్థను నెమ్మదిగా మేల్కొలిపి, రోజంతా శక్తిని అందిస్తాయి. ఈ పండ్లు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో సహాయపడతాయి.

అరటిపండు.. కొన్ని సందేహాలు
అయితే, అరటిపండు విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అరటిపండులో పొటాషియం మెగ్నీషియం అధికంగా ఉంటాయి. ఖాళీ కడుపుతో తిన్నప్పుడు, ఇవి రక్తంలో వేగంగా కలిసిపోయి గుండెపై భారం పెంచే అవకాశం ఉందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉండటం మంచిది.అలాగే, దీనిలోని అధిక చక్కెర స్థాయిలు మొదట శక్తిని ఇచ్చినా, కొద్దిసేపటికే నీరసంగా అనిపించేలా చేయవచ్చు.

జామ, ఇతర పండ్లు..
జామపండులో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిని ఖాళీ కడుపుతో తినడం వల్ల కొందరిలో కడుపు నొప్పి లేదా ఉబ్బరం వంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా పచ్చి జామకాయను పరగడుపున తినకపోవడమే మంచిది. అలాగే, నారింజ, బత్తాయి వంటి పుల్లని పండ్లను ఖాళీ కడుపుతో తింటే, వాటిలోని సిట్రిక్ ఆమ్లం కడుపులో ఎసిడిటీని, గ్యాస్‌ను పెంచి గుండెల్లో మంటకు కారణమవుతుంది.

చివరగా, ఖాళీ కడుపుతో పండ్లను తినడం అనేది వ్యక్తిగత ఆరోగ్యం, జీర్ణశక్తిపై ఆధారపడి ఉంటుంది. పొప్పయా, ఆపిల్ వంటివి సాధారణంగా సురక్షితం కాగా, అరటిపండు, జామ, పుల్లని పండ్ల విషయంలో కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఉదయాన్నే గోరువెచ్చని నీరు త్రాగిన 15-20 నిమిషాల తర్వాత పండ్లను తీసుకోవడం ఉత్తమమైన పద్ధతి. ఇది జీర్ణవ్యవస్థపై ఆకస్మిక భారం పడకుండా చేస్తుంది. అందుకే పండ్లను సరైన టైంలో తీసుకోవడం మంచిది. ఆహారం తీసుకున్నాక పండ్లను తీసుకోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.

 

Exit mobile version