Cancer In India: భారతదేశంలో పెరుగుతున్న క్యాన్సర్‌కు కాలుష్యమే కారణమా?

క్యాన్సర్ అనేది ఒక నిర్మూలించ‌లేని వ్యాధి. ఇది ఏ మనిషికైనా ప్రాణాంతకంగా మారవచ్చు. ది హిందూ రిపోర్ట్ ప్రకారం.. వివిధ రకాల కాలుష్యాల వ‌ల‌న‌ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతున్నట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు.

Published By: HashtagU Telugu Desk
Rectal Cancer

Rectal Cancer

Cancer In India: క్యాన్సర్ అనేది ఒక నిర్మూలించ‌లేని వ్యాధి. ఇది ఏ మనిషికైనా ప్రాణాంతకంగా మారవచ్చు. ది హిందూ రిపోర్ట్ ప్రకారం.. వివిధ రకాల కాలుష్యాల వ‌ల‌న‌ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతున్నట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు. వైద్యుల చెబుతున్న ప్రకారం.. భారతదేశంలో క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. భారతీయ వైద్య పరిశోధన మండలి నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ 2020- 2025 మధ్య 12 శాతం పెరుగుదలను అంచనా వేసింది. ఈ సంవత్సరం క్యాన్సర్ కేసులు 15.7 లక్షల వరకు చేరుకుంటాయని అంచనా వేసింది.

భారతదేశంలో క్యాన్సర్ కేసులు పెరగడానికి కాలుష్యం ఒక ముఖ్యమైన కారణం అయినప్పటికీ అది ఏకైక కారణం కాదు. క్యాన్సర్ పెరుగుదలకు అనేక కారకాలు కలిసి పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాలుష్యం ఒక పెద్ద అంశంగా ఉన్నప్పటికీ.. దానితో పాటు జీవనశైలి, ఆహారపు అలవాట్లు, జన్యుపరమైన కారణాలు కూడా దోహదపడుతున్నాయి.

ఈ పెరుగుదలలో ఒక ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. యువతలో క్యాన్సర్ కేసులు పెరిగే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంది. మనకు తెలిసినట్లుగా పొగాకు తాగ‌డం, మద్యం సేవించ‌డం, ఊబకాయం క్యాన్సర్‌కు కారణాలుగా ఉండవచ్చు. ఇవి ఇప్పటికీ భారతదేశంలో క్యాన్సర్‌లో పెద్ద భాగానికి కారణం కాగా.. కాలుష్యం వంటి ఇతర కారకాలు కూడా ఈ వ్యాధికి కారణమవుతున్నాయి. వాయు కాలుష్యం, నీటిలో, మట్టిలో శాశ్వతంగా ఉండే రసాయనాలు అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారం క్యాన్సర్‌తో ముడిపడి ఉన్నాయని అధ్యయనం చేయబడుతోంది.

Also Read: Myanmar Earthquake: విధ్వంసం సృష్టించిన భూకంపం.. 694కు చేరిన మృతుల సంఖ్య‌!

దేశంలో క్యాన్సర్ పెరగడానికి కారణాలు

భారతీయుల జీవనశైలిలో మార్పులు, పెరుగుతున్న కాలుష్యం, వ్యాధి ఆలస్యంగా గుర్తించడం ప్రధాన కారణాలు. ఇంకా ప్రజలలో పొగాకు, మద్యం సేవనం పెరగడం, ప్రాసెస్డ్ ఆహారం, ఆహారంలో పోషకాహార లోపం కారణంగా ఊపిరితిత్తులు, నోరు, కొలొరెక్టల్ క్యాన్సర్ కేసులలో పెరుగుదల కనిపిస్తోంది. ఊబకాయం కూడా క్యాన్సర్ కేసులను పెంచుతోంది. పరిశ్రమల రసాయనాలు నీరు, గాలి కాలుష్యాన్ని పెంచాయి. నీరు, గాలి, ఆహారంలో కాలుష్య కణాల కారణంగా అనేక రకాల క్యాన్సర్‌లు సంభవిస్తున్నాయి. ఇందులో శ్వాసకోశ, కడుపు క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది.

శ్వాసకోశ క్యాన్సర్

ఇది ఊపిరితిత్తులలో అసాధారణ కణాలు అనియంత్రితంగా పెరిగి గడ్డలను ఏర్పరచడం ద్వారా సంభవిస్తుంది. భారతదేశంలో ఇది చాలా సాధారణ క్యాన్సర్‌లలో ఒకటి. ముఖ్యంగా పొగాకు సేవనం, వాయు కాలుష్యం వల్ల వ‌స్తుంది.

కారణాలు

  • సిగరెట్ తాగడం (పొగాకు పొగలోని రసాయనాలు ఊపిరితిత్తులను దెబ్బతీస్తాయి).
  • వాయు కాలుష్యం (PM2.5 వంటి సూక్ష్మ కణాలు).
  • రేడాన్ వాయువు, ఆస్బెస్టాస్ వంటి పదార్థాలకు గురికావడం.
  • జన్యుపరమైన కారణాలు కూడా ఉండవచ్చు.

లక్షణాలు

  • నిరంతర దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి, రక్తంతో కూడిన దగ్గు.

కడుపు క్యాన్సర్

ఇది కడుపు లోపలి పొరలో కణాలు అసాధారణంగా పెరగడం వల్ల సంభవిస్తుంది. దీనిని గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అని కూడా అంటారు.

లక్షణాలు

  • కడుపు నొప్పి, ఆకలి మందగించడం, గుండెల్లో మంట, బరువు తగ్గడం.
  Last Updated: 29 Mar 2025, 09:42 AM IST