పైనాపిల్.. పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడే తినే పండ్లలో పైనాపిల్ కూడా ఒకటి. పైనాపిల్ కాస్త తీయగా కాస్త పుల్ల పుల్లగా ఉంటుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. వీటిని తినడానికి చాలా వరకు ఇష్టపడుతూ ఉంటారు.. అన్ని సీజన్ లలో మనకు ఈ పైనాపిల్ లభిస్తూ ఉంటుంది. ఇకపోతే పైనాపిల్ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇది జీర్ణక్రియ సక్రమంగా పనిచేయడంలో సహాయపడుతుంది. ఇది జుట్టు రాలడం తగ్గించడంలో సహాయపడుతుంది. రక్త నాళాల్లో రక్తం గడ్డకట్ట కుండా కాపాడుతుంది. ఆడవారికైతే నెలసరి సక్రమంగా వచ్చేందుకు తోడ్పడుతుంది. అయితే పైనాపిల్ తింటే క్యాన్సర్ రాదని చాలామంది అంటూ ఉంటారు. ఈ విషయం గురించి వైద్యులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
పండిన పైనాపిల్ పండును తింటుంటే పళ్ళ నుండి రక్తం కారే స్కర్వే వ్యాధి రాకుండా రక్షణ కలిగిస్తుందట. పూర్తిగా పండని పైనాపిల్ రసం తీసుకుంటే కడుపులో పురుగులు చచ్చిపోతాయట. జ్వరం, కామెర్ల వంటి అనారోగ్యాలలో ఉన్న వారికి పైనాపిల్ జ్యూస్ తాగించటం ఎంతో మంచిదనీ వైద్యులు చెబుతున్నారు. పైనాపిల్ రసాన్ని ముఖానికి రాసుకుని మర్థన చేస్తే ముఖ చర్మం కోమలంగా, అందంగా మారుతుందట. ఈ పండులోని ఎంజైములు ముఖ చర్మంలో నశించిన కణాలను తొలగిస్తాయట. అంతే కాకుండా నల్లటి మచ్చలను తొలగిస్తుందనీ చెబుతున్నారు. అలాగే ఈ పైనాపిల్ లోని ఎంజైమ్స్ వాపులను, నాసికా సంబంధమైన వ్యాధులను, టైఫాయిడ్ ని ఉపశమనం చేస్తుంది.
పచ్చి పైనాపిల్ రసాన్ని తెగిన గాయా లపై వేస్తే రక్తస్రావం అరికడుతుందట. పైనాపిల్ రసాన్ని పచ్చకామెర్ల వ్యాధి, కాలేయ వ్యాధులు ఉన్నవారు ప్రతిరోజు ఈ రసాన్ని తాగితే మంచి ఫలితాలన్ని ఇస్తుందని చెబుతున్నారు. పైనాపిల్ లో ఉన్న ఫైబర్ కంటెంట్ అనేది మలబద్ధకం తగ్గించడానికి సహాయపడుతుంది. పైనాపిల్ లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల కంటి సమస్యలు దరిచేరకుండా చూస్తుందట. ఇందులో బీటా కెరోటిన్ కూడా సమృద్దిగా ఉంటుంది. కంటి చూపు బాగుండటానికి ఇది ఉపయోగపడుతుందని చెబుతున్నారు.