నెయ్యి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు నెయ్యి వేసుకొని తింటూ ఉంటారు. అందరు మాత్రం నెయ్యి తినడానికి ఎంతగా ఇష్టపడరు. అయితే చాలామందిని తింటే బరువు పెరుగుతారని తినకుండా ఉంటారు. నెయ్యి బరువును పెట్టడం మాత్రమే కాదండోయ్ ఈజీగా బరువును కూడా తగ్గిస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా నెయ్యితో పాటు మన వంటింట్లో దొరికే ఒక మసాలా దినుసులు ఉపయోగించి ఈజీగా అధిక బరువును పొట్ట చుట్టూ ఉండే కొవ్వును శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించుకోవచ్చు అని చెబుతున్నారు. మరి అందుకోసమే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
నెయ్యి, నల్ల మిరియాలు దాదాపు ప్రతి వంటగదిలో ఉంటాయి. ఈ రెండింటినీ సాధారణంగా వంటల్లో ఉపయోగిస్తారు. ఇవి ఆహారం రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. వీటిని కలిపి తినడం వల్ల ప్రయోజనాలు కూడా రెట్టింపు అవుతాయట. మిరియాల్లో కూడా విటమిన్ ఎ, విటమిన్ సి, కెరోటిన్, ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి. ఈ రెండూ అనేక రకాల ఆరోగ్య సంబంధిత సమస్యలను తొలగించడంలో ప్రభావవంతంగా ఉంటాయి. ఇవి రెండు కలిపి తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందట. ముఖ్యంగా చలికాలంలో రోగాన్ని తట్టుకునే శక్తి లభిస్తుందని ఈ రెండింటిలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయని చెబుతున్నారు. రెండు కలిపి తీసుకోవడం వల్ల శరీరాన్ని అనేక రకాల ఇన్ఫెక్షన్ల వ్యాధుల నుంచి సంరక్షించుకోవచ్చట.
అలాగే నెయ్యి, మిరియాలు కలిపి తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుందట. నల్ల మిరియాల్లో పైపెరిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది జీర్ణ ఎంజైమ్ ల ఉత్పత్తిని పెంచుతుందట. అంతే కాకుండా నెయ్యి కడుపుని శుభ్రపరుస్తుందని చెబుతున్నారు. అలాగే ఇది శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపుతుందట. ఈ రెండింటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, గ్యాస్, మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యల నుంచి రిలీఫ్ లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. చాలామంది చలికాలంలో దగ్గు జలుబు సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. సమస్యల నుంచి పూర్తిగా బయటపడాలి అంటే నెయ్యి మిరియాలు కలిపి తీసుకోవాలని చెబుతున్నారు.మిరియాలు గొంతు, ఛాతీలో పేరుకుపోయిన శ్లేష్మాన్ని క్లియర్ చేయడంలో సాయపడతాయి.
ఈ రెండింటి వినియోగం వల్ల జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభించడమే కాకుండా గొంతు నొప్పి, వాపు నుంచి కూడా రిలీఫ్ వస్తుందట. అలాగే నెయ్యి మిరియాలు కలిపి తీసుకుంటే ఈజీగా బరువు తగ్గవచ్చని, ఇవి రెండు కలిపి తినడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుందని చెబుతున్నారు. అలాగే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కూడా వేగంగా కరిగిపోతుందట. నల్ల మిరియాల్లో ఉండే పైపైరిన్ కొవ్వును విచ్చిన్నం చేయడంలో సాయపడుతుంది. ఇక, నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. దీంతో ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. ఇందుకోసం మిరియాలు పొడి చేసి అందులో ఒక చెంచా నెయ్యి వేసుకుని ఈ మిశ్రమాన్ని బాగా కలిపి తింటే పైన చెప్పిన సమస్యల నుంచి ఈజీగా బయటపడవచ్చట.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు కనిపిస్తాయని చెబుతున్నారు.