Site icon HashtagU Telugu

Health Tips: ఖాళీ కడుపుతో పుట్నాలు,బెల్లం కలిపి తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Health Tips

Health Tips

వేయించిన శనగలు వీటిని చాలా ప్రదేశాలలో పుట్నాలు అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఈ పుట్నాల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. టైంపాస్ గా తినడానికి ఇవి చాలా బాగా ఉంటాయి. ఇవి బెల్లం కలిపి తింటే ఎన్నో రకాల ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి పుట్నాలు,బెల్లం కలిపి తింటే ఏం జరుగుతుందో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. శీతాకాలంలో ఖాళీ కడుపుతో బెల్లం, పుట్నాలు కలిపి తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్‌ పెట్టవచ్చట. బెల్లం, పుట్నాలు కలిపి తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుందట.

ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, జింక్, సెలీనియం వంటి ఖనిజాలు ఉన్నాయి. ఇవి శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి కాపాడతాయట. బెల్లం, వేయించిన శ‌న‌గ‌ప‌ప్పు ఈ రెండూ విడి విడిగా రుచిగా ఉంటాయి. కలిపి తింటే రుచి అమోఘంగా ఉంటుందని చెబుతున్నారు. శనగపప్పులో ప్రొటిన్లు ఎక్కువగా ఉంటాయి. బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో పాటు బెల్లంలో జింక్, సెలీనియం మెండుగా ఉన్నాయి. వేయించిన శనగపప్పులో బీ6, సీ, ఫోలేట్, నియాసిన్, థయామిన్, రైబోఫ్లావిన్, మాంగనీస్, ఫాస్పరస్, ఐరన్‌, రాగి వంటి ఇతర ఖనిజాలు కూడా ఇందులో ఉన్నాయి. కాగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో బెల్లం, వేయించిన శ‌న‌గ‌ప‌ప్పు తినటం వల్ల జీర్ణవ్యవస్థను సక్రియం చేస్తుందట. ఇది మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యల నుండి ఉపశమనం అందిస్తుందని చెబుతున్నారు.

అలాగే ఇది కడుపుని శుభ్రపరుస్తుందట. శరీరం నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుందని, బెల్లం, పుట్నాలు కలిపి తినటం వల్ల ప్రోటీన్, పొటాషియం, పిండి పదార్థాలు సమృద్ధిగా లభిస్తాయట. ఇవి కండరాలు, ఎముకలను బలోపేతం చేస్తాయట. కండరాల అభివృద్ధికి సహాయపడతాయని చెబుతున్నారు. ఐరన్ పుష్కలంగా ఉండే బెల్లం, పుట్నాలు రక్తహీనతను నివారిస్తుందట. ఇది హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుందని చెబుతున్నారు. మహిళల్లో ఇనుము లోపాన్ని తొలగించడంలో సహాయపడుతుందట. బెల్లం, పుట్నాలలో కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం అధికంగా ఉండటం వల్ల ఇది ఎముకల నొప్పిని తగ్గించి, ఎముకలను బలపరుస్తుందని చెబుతున్నారు.

ఇది అవసరమైన పోషకాలను కలిగి ఉంటుందట. ఇది శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుందట. రోజూ ఉదయాన్నే బెల్లం, శనగపప్పు తింటే ఈజీగా బరువు పెరుగుతారట. బెల్లం, శనగలు తీసుకోవడం వల్ల మెదడు పదును పెడుతుంది. ఇందులో ఉండే విటమిన్ బి6 మెదడు పనితీరును మెరుగుపరుస్తుందట. అలాగే జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. శరీరంలోని జీర్ణ ఎంజైమ్‌లను సక్రియం చేస్తుందట. ఇది కాలేయాన్ని శుభ్రపరుస్తుందట. శరీరం నుండి విష వ్యర్థాలను సులభంగా తొలగిస్తుందట. బెల్లం, పుట్నాల పప్పును రోజూ తీసుకోవడం వల్ల కండరాలు వృద్ధి చెందుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.