ప్రస్తుత రోజుల్లో చాలామంది అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అధిక రక్తపోటు కారణంగా కొన్ని కొన్ని సార్లు ఊహించని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. బీపీ ఎక్కువ తక్కువ అయినప్పుడు రక రకాల సమస్యలు మొదలవుతూ ఉంటాయి. గుండెపోటు మధుమేహం రక్తపోటు షుగర్ పేషెంట్స్ గా కూడా అవ్వచ్చు. కాబట్టి రక్తపోటు సమస్యను తగ్గించుకోవడం చాలా ముఖ్యం. కాగా ఈ బీపీ సమస్య ఉన్నవారు తినే ఆహారం విషయంలో ప్రత్యేక జాగ్రత్త వహించాలి. కాగా బీపీ కంట్రోల్ లో ఉండాలంటే ఇప్పుడు మేము చెప్పబోయే ఒకటి తీసుకుంటే చాలు అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆ ఒక్కటి ఎంతో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
అయితే చాలా మంది ప్రస్తుతం ఆహార పదర్థాలలో ఉప్పును ఎక్కువగా తీసుకుంటున్నారు. రుచి కోసం చప్పగా తినడానికి ఇష్టపడని వారు ఎక్కువగా ఉప్పు తీసుకోవడం వల్ల రక్తనాళాలు గట్టిపడుతాయి. దీంతో రక్తపోటుకు కారణం అవుతుంది. దీనివల్ల రక్తాన్ని పంప్ చేయడానికి గుండె ఎక్కువ సార్లు కొట్టకొవాల్సి వస్తుంది. దీంతో హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే ఉప్పు తగ్గించి జీవన శైలీలో మార్పులు చేసుకుంటే బీపీని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. నారింజ, నిమ్మకాయ ద్రాక్షపండ్లు వంటి పుల్లగా ఉండే పండ్లను తినడం వల్ల గుండెకు మేలు జరుగుతుంది. ద్రాక్షపండ్లు తినడం ద్వారా రక్తపోటు ఉన్న పేషెంట్లలో సిస్టోలిక్ రక్తపోటు డయాస్టొలిక్ రక్తపోటు తగ్గుతుంది.
ద్రాక్షపండులో విటమిన్ సీ, పెక్టిన్ ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. నారింజ రసంతో పోల్చితే, ద్రాక్షపండు రసం ధమనులపై ఒత్తిడి తగ్గిస్తుంది.. స్ట్రీట్ ఫుడ్కు అలవాటు పడడం కూడా బీపీపై ప్రభావం చూపిస్తుంది. ఫ్రిజ్లో నిల్వ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల కూడా బీపీ లో మార్పులు వస్తాయి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఊరగాయలకు దూరంగా ఉండాలి. అలాగే స్మోకింగ్, డ్రింకింగ్ మానుకోవాలి. వాటర్ ఎక్కువగా తాగాలి. కాగా రెగ్యూలర్ గా వ్యాయామం చేయడం, నడవటం అలవాటు చేసుకోవాలి.