మనలో చాలామందికి ఉదయం లేవగానే ఫ్రూట్స్ తినడం అలవాటు ఉంటుంది. పండ్లు ఆరోగ్యానికి మంచిదే కానీ ఏవి పడితే అవి ఎలా పడితే అలా తినడం అసలు మంచిది కాదు. ముఖ్యంగా ఉదయాన్నే పరగడుపున కొన్ని రకాల పండ్లను తినక పోవడమే మంచిదని చెబుతున్నారు. ఇంతకీ ఆ పండ్లు ఏంటి? అవి తింటే ఏం జరుగుతుంది అన్న విషయానికి వస్తే.. నారింజ, గ్రేప్ ఫ్రూట్, బత్తాయి, ఉసిరి, నిమ్మ, వంటి పండ్లు సిట్రస్ జాతికి చెందినవి. ఈ పుల్లని పండ్లను ఖాళీ కడుపుతో తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని తింటే కడుపులో యాసిడ్ ఏర్పడుతుందట. ఎందుకంటే వీటిలో సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. దీంతో గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే డేంజర్ ఎక్కువగా ఉంటుందట.
అంతే కాకుండా కడుపు నొప్పి, ఏసిడిటీ, పుల్లటి తేన్పులు, వాంతులు వచ్చే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. అందుకే ఖాళీ కడుపుతో సిట్రస్ ఫ్రూట్స్ తినకూడదంటున్నారు నిపుణులు. అలాగే అరటి పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే ఈ పండును ఖాళీ కడుపుతో తినకూడదంటున్నారు నిపుణులు. అరటిపండులో మెగ్నిషియం ఎక్కువగా ఉంటుంది. ఖాళీ కడుపుతో తినడం వల్ల శరీరంలో మెగ్నిషియం, కాల్షియం స్థాయిల అసమతుల్యత ఏర్పడుటుందట. దీంతో కండరాలు కూడా పట్టేయవచ్చని, రక్తంలో మెగ్నిషియం స్థాయిలు కూడా పెరిగే ఛాన్స్ ఉందని, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
అలాగే యాపిల్ లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలతో నిండి ఉంటుంది. అందుకే రోజుకు ఒక్క యాపిల్ అయినా సరే తినాలి అంటున్నారు. అయితే యాపిల్ పండును ఖాళీ కడుపుతో తినకూడదట. ఇలా తినడం వల్ల కడుపులో ఆమ్లత్వం పెరిగే అవకాశం ఉందట,దీంతో కడుపు నొప్పి, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు రావచ్చని చెబుతున్నారు. పుచ్చకాయలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉన్నాయి. కానీ దీనిని పరగడుపున తినకూడదట. పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో పుచ్చకాయను తినడం వల్ల జీర్ణవ్యవస్థ నిదానిస్తుందట. దీంతో కడుపులో అసౌకర్యంగా ఉంటుందని, గ్యాస్, ఎసిడిటీ, కడుపు నొప్పి, అజీర్తి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని, అందుకే ఖాళీ కడుపుతో పుచ్చకాయను తినకపోవడమే మంచిదని చెబుతున్నారు. అలాగే ద్రాక్ష చెర్రీలు టమోటా వంటి పండ్లను కూడా ఖాళీ కడుపుతో తినకూడదట. వీటిని తినడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తవచ్చట. ఖాళీ కడుపుతో తింటే పొట్టలో అసౌకర్యం, ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలు, నొప్పి రావచ్చని, అందుకే ఈ పండ్లను ఖాళీ కడుపుతో తినకూడదని చెబుతున్నారు.