మాములుగా మనం తరచుగా రక రకాల పండ్లు తింటూ ఉంటాం. అలాగే సీజినల్ ఫ్రూట్స్ కూడా తింటూ ఉంటాము. అయితే చాలామంది ఏవైనా పండ్లే కదా అని తెగ తినేస్తూ ఉంటారు. కానీ అలా తినడం ఆరోగ్యానికి ఎంత మంచిది కాదని చెబుతున్నారు. ఎలాంటి పండ్లు అనుకున్నంత మంచివి కావో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆరెంజ్ పండ్లను చాలా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందట. ఆరెంజెస్ తినడం వల్ల కడుపులో ఎసిడిటిక్ రియాక్షన్ వస్తుందట.
వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల హార్ట్ బర్న్, డిస్ కంఫర్ట్ ఉంటుంది. అందుకే ఈ పండ్లు అందరికీ సూట్ అవ్వవు అని చెబుతున్నారు. వీటిని మరీ ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదట. లిచ్చి పండ్లు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. మంచిగా జ్యూసీగా, తియ్యగా ఉంటాయి. వీటిలో మంచి విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లు తినడం వల్ల కూడా తెలియని ఒక ప్రమాదం దాగి ఉందట. వీటిలో సహజంగానే టాక్సిన్స్ ఉంటాయట. బ్లడ్ షుగర్ లెవల్స్ డ్రాప్ అవుతాయట. ముఖ్యంగా పరగడుపున ఈ పండు తినడం చాలా ప్రమాదం అని వీటిని ఎక్కువగా తినడం వల్ల చాలా ప్రమాదం జరుగుతుందని, మితంగా మాత్రమే తినడం మంచిదని చెబుతున్నారు.
అలాగే మనలో చాలా మంది డేట్స్ ని ఇష్టంగా తింటూ ఉంటారు. షుగర్ కి బదులుగా డేట్స్ తీసుకుంటూ ఉంటారు. కానీ డేట్స్ ని ఎక్కువగా తినడం కూడా మంచిది కాదట. ఎందుకంటే వీటిని ఎక్కువగా తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతాయట. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ వీలైనంత వరకు వీటికి దూరంగా ఉండాలని, షుగర్ తీసుకోకూడదు అనుకునే వాళ్లు డేట్స్ తినడం వల్ల కూడా మీకు తెలీకుండానే షుగర్ తీసుకుంటున్నారని అర్థం అంటున్నారు. కొబ్బరి కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎందుకు కొబ్బరిని చాలా విధాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. ఎండు కొబ్బరిలో క్యాలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. శాచురేటెడ్ ఫ్యాట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ ఎండు కొబ్బరిని తీసుకోవడం వల్ల అధిక బరువు పెరిగే అవకాశం ఉంటుందట. కార్షియో సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. సహజంగా పండ్లు తియ్యగా ఉంటాయి. అవి మంచిదే కానీ కృత్రిమ స్వీట్నర్స్ కలిపే ఫ్రూట్ జ్యూస్ లు ఏవీ మంచివి కావట. మనం పండ్ల రసమే కదా అనుకుంటూ ఉంటాం. కానీ అందులో షుగర్స్ కలపడం వల్ల అవి ఆరోగ్యానికి మంచివి కావట. కాబట్టి టెట్రా ప్యాకెట్స్, క్యాన్స్ లో అమ్మే జ్యూసులు కూడా తాగకూడదట.