శరీరంలో రక్తానికి (Blood) చాలా ప్రాధాన్యత ఉంటుంది. శరీరంలోని ప్రతి కణానికి ఆక్సిజన్, పోషకాలు తీసుకుని వెళ్ళేది రక్తమే. అందుకే రక్తప్రసరణ ఖచ్చితంగా జరగాలి. లేదంటే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. రక్తంలోని ఎర్ర రక్త కణాలు శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ ని రవాణా చేయడంలో సహాయపడతాయి. శరీర సాధారణ పనితీరుకి ఇది చాలా ముఖ్యమైనది. రక్తాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి పోషకాలు నిండిన ఆహారం తీసుకోవాలి. హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి రక్తానికి (Blood) అవసరమైన పోషకాల్ని అందించి ఆరోగ్యకరమైన రక్తప్రవాహానికి ఈ ఆహారాలు డైట్లో చేర్చుకుంటే మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
ఐరన్ రిచ్ ఫుడ్స్, మూలికలు తీసుకోవడం వల్ల రక్తం బాగుంటుంది. శరీర పనితీరుకి ఏ ఆటంకం కలగకుండా చూసుకుంటుంది. ఆహారాలతో పాటు రక్తం ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం చేయడం కూడా ముఖ్యమే. జాగింగ్, స్విమ్మింగ్, వాకింగ్, సైక్లింగ్ వంటి తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల హృదయ స్పందన రేటు కూడా పెరుగుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. గుండెలోని మురికిని లేదా మలినాలను బయటకి పంపుతుంది. గుండె నుండి ఇతర అవయవాలకు రక్తం ఎటువంటి ఆటంకం లేకుండా ప్రసరణ జరిగేలా చేస్తుంది.
సరిపడినంత రక్తం లేకపోతే రక్తహీనత సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రక్త సరఫరా సరిగా జరగకపోతే కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. తరచూ జ్వరం రావడం, చలిగా అనిపించడం, పాదాలు, చేతులు తిమ్మిర్లు, శరీరంలో నీరు చేరడం వంటివి జరుగుతాయి. నీరు చేరడాన్ని ఎడిమా అంటారు. జ్ఞాపకశక్తి మందగిస్తుంది. చర్మం తెల్లగా పాలిపోయి కనిపిస్తుంది. ఎంత తిన్నా కూడా నీరసంగా కళ్ళు తిరిగడం, మైకం, ఒళ్ళు నొప్పులు అధికంగా ఉంటాయి. అందుకే పోషకాలు నిండిన ఆహారం తీసుకుంటూ రక్త ఉత్పత్తిని పెంచుకోవాలి.
Also Read: Liver Cirrhosis: ఈ ఆయుర్వద మూలికలతో లివర్ సిర్రోసిస్ సమస్యను దూరం చేసుకోవచ్చు.