Pan: డయాబెటిస్ (చక్కెర వ్యాధి) ఉన్నవారు పాన్ తినవచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. మన దేశంలో పాన్ తినే అలవాటు ఉన్నవారు చాలా మంది ఉన్నారు. పైగా ఇప్పుడు అందులో ఎన్నో వెరైటీలు అందుబాటులోకి వచ్చాయి. అయితే డయాబెటిస్ రోగులకు పాన్ ఎంతవరకు సురక్షితం? కేవలం తమలపాకు మాత్రమే తినవచ్చా? ఈ విషయాలపై నిపుణులు ఏమంటున్నారో ఇక్కడ తెలుసుకుందాం.
పాన్ తినడం వల్ల షుగర్ లెవల్ పెరుగుతుందా?
డయాబెటిస్ ఉన్నవారు పాన్ (కట్లీ/కిళ్లీ) తినకుండా ఉండటమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే పాన్లో ఉండే వక్కలో అరెకోలిన్ అనే మూలకం ఉంటుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని తగ్గించి, రక్తంలో చక్కెర స్థాయిని పెంచే అవకాశం ఉంది. దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ముప్పు కూడా పెరుగుతుంది. అంతేకాకుండా పాన్ తినడం వల్ల నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. పాన్లో కలిపే పొగాకు చక్కెర మెటబాలిజంపై ప్రభావం చూపుతుంది. ఇక ‘మీఠా పాన్’ (తీపి పాన్) విషయానికి వస్తే అందులో ఉండే తీపి పదార్థాల వల్ల షుగర్ లెవల్స్ పెరగడం సహజం.
Also Read: సిద్దమైన రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ సీజన్ 4
కేవలం తమలపాకు మాత్రమే తినవచ్చా?
ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే.. కేవలం తమలపాకు మాత్రమే తినవచ్చా? దీనిపై వెలువడిన పలు నివేదికల ప్రకారం.. డయాబెటిస్ రోగులు కేవలం తమలపాకులను (ఏమీ కలపకుండా) తీసుకోవచ్చు. కొన్ని పరిశోధనల ప్రకారం తమలపాకులలో యాంటీ-హైపర్ గ్లైసీమిక్ గుణాలు ఉన్నాయి. ఇవి రక్తంలోని చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి.
అలాగే ఈ ఆకుల్లో ఉండే ఫైటోకెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడమే కాకుండా, ఆక్సిడేటివ్ స్ట్రెస్ను తగ్గిస్తాయి. ఇది డయాబెటిస్ ఉన్నవారికి మేలు చేస్తుంది.
