భారతీయుల వంటగదిలో పసుపు తప్పనిసరిగా ఉంటుంది. పసుపును ప్రతిరోజు ఎన్నో రకాల వంటకాలలో ఉపయోగిస్తూ ఉంటారు. పసుపును కూరల్లో వేయడం వల్ల రంగుతో పాటు రుచిని కూడా పెంచుతుంది. పసుపులో దివ్య ఔషధ గుణాలు దాగున్నాయి. దీనిని ఉపయోగించి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. పసుపును ఉపయోగించి శరీర మంట నుంచి ఆక్సీకరణ ఒత్తిడి వరకు ఎన్నో సమస్యలను తగ్గించుకోవచ్చు. అందుకే పసుపును ఎన్నో సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. పసుపు ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడానికి కూడా సహాయపడుతుంది.
ఇక ప్రతిరోజూ పడుకునే మందు గ్లాస్ గోరువెచ్చని పాలలో కొద్దిగా పసుపు వేసుకుని తాగితే హాయిగా నిద్రపట్టడంతో పాటుగా ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుందని చెబుతున్నారు. పసుపును మోతాదుకు మించి ఉపయోగించడం వల్ల వచ్చే నష్టమేమీ లేదు. కానీ దీన్ని హెవీగా ఉపయోగిస్తేనే ఎన్నో సమస్యలు వస్తాయి. పసుపులో ఐరన్, జింక్, ప్రోటీన్, కాల్షియం, ఫైబర్, రాగి వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. మరి ఈ పసుపును ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
పసుపుతో కూడా ఉదర సమస్యలను తగ్గించుకోవచ్చట. అలా అని దీన్ని మరీ ఎక్కువగా వాడితే మాత్రం కడుపుకు సంబంధించిన సమస్యలు వస్తాయట. లిమిట్ కంటే ఎక్కువ పసుపును తీసుకుంటే కడుపు నొప్పి వస్తుందటీ. అలాగే కడుపు తిమ్మిరి సమస్య కూడా వస్తుందని . చెబుతున్నారు. అలాగే కిడ్నీ స్టోన్స్ వల్ల వచ్చే నొప్పి మాటల్లో చెప్పలేము. అయితే పసుపు కూడా రాళ్లు ఏర్పడటానికి కారణమవుతుందని చెబుతున్నారు. ఎందుకంటే దీనిలో ఆక్సలేట్ ఉంటుంది. అందుకే దీన్ని ఎక్కువగా తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే కిడ్నీ పేషెంట్లు పసుపును తక్కువగా తినాలని చెబుతున్నారు. కాగా పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎన్నో సమస్యలను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.
అయితే మీరు పసుపును మరీ ఎక్కువగా తీసుకుంటే వికారంతో పాటుగా విరేచనాల సమస్య కూడా వస్తుందట. కొన్నిసార్లు పసుపు వల్ల అలర్జీ కూడా వస్తుంటుంది. పసుపులో ఉండే కొన్ని సమ్మేళనాలే అలెర్జీలను కలిగిస్తాయని చెబుతున్నారు. పసుపును చర్మానికి అప్లై చేయడం వల్ల కొందరికి దురద, దద్దుర్లు వంటి సమస్యలు కూడా వస్తాయట. మధుమేహులకు పసుపు అంత మంచిది కాదని చెబుతున్నారు. అయితే డయాబెటిక్ పేషెంట్ల బ్లడ్ చిక్కగా మారుతుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి వీళ్లు మందులను వాడుతుంటారు. అయితే పసుపు రక్తాన్ని పలుచగా చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. మందులను వాడి, పసుపును తీసుకుంటే డయాబెటీస్ పేషెంట్ల రక్తం మరీ పల్చగా మారుతుంది. ఇది ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. అందుకే మందులను వాడే డయాబెటీస్ పేషెంట్లు పసుపును తీసుకోవడం మానేయాలని చెబుతున్నారు.
note: పైన ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్న వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.