Foods to Avoid in Summer: వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. లేదంటే?

వేసవికాలం మొదలైంది అంటే చాలు ఏక రకాల అనారోగ్య సమస్యలు కూడా మొదలవుతూ ఉంటాయి. వేస‌వి కాలంలో మ‌నకు స‌హ‌జంగానే సీజ‌న‌ల్‌గా వచ్చే స‌మ‌స్య‌

  • Written By:
  • Publish Date - March 15, 2024 / 09:20 PM IST

వేసవికాలం మొదలైంది అంటే చాలు ఏక రకాల అనారోగ్య సమస్యలు కూడా మొదలవుతూ ఉంటాయి. వేస‌వి కాలంలో మ‌నకు స‌హ‌జంగానే సీజ‌న‌ల్‌గా వచ్చే స‌మ‌స్య‌లు కొన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కొంద‌రికి ఈ సీజ‌న్‌లోనూ ద‌గ్గు, జ‌లుబు వ‌స్తుంటాయి. ఇక ప్ర‌తి ఒక్క‌రి శ‌రీరం వేడిగా ఉంటుంది. వేసవిలో శరీరంలో నీటి శాతాన్ని సక్రమంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా వేసవిలో వచ్చే డిహైడ్రేషన్ అలసట వడదెబ్బ కళ్ళు తిరగడం ఇలాంటి ఎన్నో రకాల సమస్యల్లో రాకుండా ఉండాలంటే కొన్ని రకాల జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. అలాగే క‌డుపులో మంట‌, గ్యాస్ వంటి జీర్ణ స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. ఇక కొంద‌రు నీళ్ల‌ను తాగ‌క‌పోవ‌డం వ‌ల్ల శరీరం డీహైడ్రేష‌న్ బారిన ప‌డతారు.

వడ దెబ్బ‌కు గుర‌వుతారు. కొన్ని సార్లు మ‌నం తినే ఆహారాలు, తాగే ద్ర‌వాలు కూడా ఈ స‌మ‌స్య‌ల‌కు కార‌ణ‌మ‌వుతుంటాయి. వేసవిలో సూప్ వెరైటీలు, పండ్ల రసాలు, నీరు, మజ్జిగ పదార్థాలను ఎక్కువగా తీసుకుంటుండాలి. ఇలా తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది. వేస‌వి సీజ‌న్‌లో ఆహారాల ప‌ట్ల జాగ్ర‌త్త‌లు పాటించాలి. ముఖ్యంగా కొన్ని ర‌కాల ఆహారాల‌ను ఈ సీజ‌న్‌లో తీసుకోకపోవటమే మంచిది. కాదని తీసుకుంటే మాత్రం స‌మ‌స్య‌లు వ‌స్తాయి. మ‌రి అలాంటి ఆహారాలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వేస‌విలో స‌హ‌జంగానే మ‌న‌కు దాహం అధికంగా ఉంటుంది. ఈ సమయంలో మ‌ద్యం సేవిస్తే ఆ దాహం మరింత పెరుగుతుంది. ఈ క్రమంలో నాలుక పొడి బారిపోయి శ‌రీరం డీహైడ్రేష‌న్గు రవుతుంది. ఈ పరిస్ధితి వల్ల లివ‌ర్‌ ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుంది. కాబట్టి వేస‌విలో మ‌ద్యం సేవించ‌డం ఏమాత్రం మంచిది కాదు. వేసవిలో నూనెతో చేసిన ప‌దార్థాల‌ను తీసుకోరాదు.

వీటిని మోతాదుకు మించి తీసుకుంటే విరేచనాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాహం కూడా అధికంగా ఉంటుంది. ఎండ దెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది. ఈ సీజ‌న్‌లో అధికంగా లభించే మామిడి పండ్ల‌ను చాలా మంది ఎక్కువగా తింటుంటారు. అయితే ఒక మోస్త‌రుగా మించి అధికంగా తింటే మాత్రం శ‌రీరంలో వేడి పెరుగుతుంది. విరేచ‌నాలు అవుతాయి. ఈ సీజ‌న్‌లో త‌క్కువ మోతాదులో మామిడిపంట్లను తీసుకోవాలి. కారం, మ‌సాలాలు అధికంగా ఉండే ఆహారాల‌ను, మాంసాహారాల‌ను తీసుకోవటం వల్ల జీర్ణసంబంధిత సమస్యలు ఉత్పన్నం అవుతాయి. క‌డుపులో మంట వస్తుంది. కాబ‌ట్టి ఈ ఆహారాలను ప‌రిమిత మోతాదులో తీసుకోవటం మంచిది. బేక‌రీ ప‌దార్థాలు, ఇత‌ర జంక్ ఫుడ్స్‌ను తిన‌డం కూడా మానేయాలి. ఇవి దాహం అధికంగా అయ్యేలా చేస్తాయి. శ‌రీరంలో నీటి శాతాన్ని త‌గ్గిస్తాయి. ఇది మ‌న‌కు ఈ సీజ‌న్‌లో మంచిది కాదు. టీ, కాఫీల‌ను త‌గ్గించాలి. వీటిని అధికంగా తీసుకుంటే గ్యాస్‌, జీర్ణ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఫ్రిజ్‌లో పెట్టిన ఐస్ వాటర్‌ను తాగడం మంచిది కాదు. ఇలా తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. డ్రై ఫ్రూట్స్, ఎండుద్రాక్ష, నేరేడు పండు మొదలైనవి వేసవికాలంలో శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి మరియు మీకు చిరాకు అలసటను కూడా కలిగిస్తాయి. ఐస్‌క్రీమ్‌లు వేసవిలో వేడి ఎదుర్కోవడానికి చాలా మంది వీటిని తీసుకుంటారు. వేసవి కాలంలో ఎక్కువ ఐస్ క్రీం తినడం వల్ల జలుబు సంబంధిత వ్యాధుల ప్రమాదం కలుగుతుంది. కాబట్టి వేసవిలో తీసుకునే ఆహారం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.